News June 17, 2024
BJPకే స్పీకర్ పోస్ట్.. మిత్రపక్షాలకు డిప్యూటీ?

లోక్సభ స్పీకర్ పదవిని తమ పార్టీ వారికే కేటాయించాలని బీజేపీ నిర్ణయించినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. NDA కూటమిలోని మిత్రపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందట. ఈ విషయంలో మిత్రపక్షాలను ఒప్పించే టాస్క్ కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్కు అప్పగించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ పోస్టు టీడీపీ, జనతా దళ్ పార్టీల్లో ఎవరికి ఇస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.
Similar News
News January 25, 2026
కొచ్చిన్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 25, 2026
రంగులు మారే గణపతి ఆలయం.. ఎక్కడంటే?

TN కేరళపురంలో శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అందర్నీ అబ్బురపరుస్తోంది. ఇక్కడి వినాయక విగ్రహం ఉత్తరాయణంలో నలుపు, దక్షిణాయనంలో తెలుపు రంగులో దర్శనమిస్తుంది. ఇక్కడి బావి నీరు కూడా విగ్రహానికి వ్యతిరేక రంగులోకి మారుతుంటాయి. ఆలయ ప్రాంగణంలోని మర్రిచెట్టు కూడా కాలానుగుణంగా ఆకు రాల్చడం, చిగురించడం వంటి వింతలు ప్రదర్శిస్తుంది. 12వ శతాబ్దపు ఈ పురాతన గుడి మిరాకిల్ వినాయకర్గా భక్తులను ఆకర్షిస్తోంది.
News January 25, 2026
‘మన్ కీ బాత్’లో అనంతపురం ప్రస్తావన

AP: ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలోని అనంతపురం గురించి ప్రస్తావించారు. నీటి ఎద్దడి పరిష్కారానికి అక్కడి ప్రజల శ్రమను అభినందించారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో పదికి పైగా జలాశయాలను పునరుద్ధరించారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో 7 వేలకు పైగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు బాటలు వేశారని పొగిడారు. కాగా ప్రధాని మోదీ 130వ ‘మన్ కీ బాత్’లో ఈరోజు మాట్లాడారు.


