News February 8, 2025
10 నుంచి బోదకాలపై స్పెషల్ డ్రైవ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738965214654_695-normal-WIFI.webp)
ఫైలిరియాసిస్(బోదకాలు) నివారణకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 10న స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించనుంది. ఏపీ సహా 13 రాష్ట్రాల్లోని 111 జిల్లాల్లో 2 వారాలపాటు కొనసాగనుంది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటికే వచ్చి ఉచితంగా ఔషధాలు అందిస్తారని, తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. క్యూలెక్స్ దోమల కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీనివల్ల కాళ్లతోపాటు ఇతర శరీర భాగాలు విపరీతంగా వాపునకు గురవుతాయి.
Similar News
News February 8, 2025
ప్రైవేట్ వీడియోలపై హీరో నిఖిల్ స్పందన ఇదే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738953575922_695-normal-WIFI.webp)
మస్తాన్ సాయి <<15351108>>ప్రైవేట్ వీడియోల<<>> వ్యవహారంలో లావణ్య అనే యువతి తన పేరును ప్రస్తావించడంపై హీరో నిఖిల్ స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆ వీడియోలు కార్తికేయ-2 సక్సెస్ మీట్ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీలోనివని చెప్పారు. తన కుటుంబసభ్యులతో ఉన్న దృశ్యాలను తప్పుగా చూపిస్తున్నారని తెలిపారు. వాస్తవం పోలీసులకు కూడా తెలుసని, అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
News February 8, 2025
శ్రీకాకుళంలోని ఆ 104 గ్రామాల్లో ‘తండేల్’ కథలే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738976456335_782-normal-WIFI.webp)
AP: శ్రీకాకుళం (D) K.మత్య్సలేశంకు చెందిన రామారావు, కొందరు జాలర్ల వాస్తవిక జీవితం ఆధారంగా తీసిన మూవీ ‘తండేల్’. అయితే జిల్లాలోని 193KM తీర ప్రాంతంలో ఉన్న 104మత్స్యకార గ్రామాల్లో ఇలాంటి కథలే కన్పిస్తాయి. ఫిషింగ్ హార్బర్లు లేక కొందరు నాటు పడవలపై ప్రమాదకరంగా చేపల వేట చేస్తున్నారు. వేలాదిగా ముంబై, వీరావల్(గుజరాత్) పోర్టులకు వలస వెళ్లి వ్యాపారుల వద్ద పనుల్లో చేరి దాదాపు సముద్రానికే అంకితమవుతున్నారు.
News February 8, 2025
27 ఏళ్ల తర్వాత BJP జెండా ఎగరేస్తుందా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738759990869_782-normal-WIFI.webp)
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో తేలిపోనున్నాయి. దేశ రాజధానిపై తన జెండా ఎగిరేయడానికి దాదాపు 3 దశాబ్దాలుగా BJP ఎదురు చూస్తోంది. AK చేసిన యమునాలో విషం, రామాయణం వ్యాఖ్యలను ఆ పార్టీ గట్టిగానే తిప్పికొట్టింది. ఆప్ది అవినీతి ప్రభుత్వమనే విమర్శలతోనూ ఇరకాటంలో పెట్టి పోటాపోటీగా తలపడింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు 27ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. దీనిపై మీ కామెంట్.