News November 28, 2024

ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్స్

image

TG: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫుడ్ ప్రిపేర్ చేసే ముందు, వంట పూర్తయ్యాక చెక్ చేయనున్నారు. ఇందుకోసం టీచర్లు, విద్యార్థులతో ప్రత్యేకంగా మానిటరింగ్ టీమ్స్ వేయనున్నారు. బియ్యం, పప్పులు, నీళ్లు, కూరగాయలు, ఇతర సామగ్రిని కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. సరిగా లేకుంటే వెంటనే మార్చేస్తారు.

Similar News

News November 12, 2025

మీరూ ఈ ప్రశ్న అడుగుతున్నారా?

image

పాతికేళ్లు దాటిన యువతకు సమాజం నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అందులో ఒకటి ‘పెళ్లెప్పుడు చేసుకుంటావ్?’ ఇలా పదేపదే అడగడం వల్ల వారు మానసికంగా ఒత్తిడికి లోనవుతారని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. నిద్రలేమి, ఆందోళన, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి వాటికి గురవుతారని, తమలో ఏదో లోపం ఉందని భావన కలుగుతుందంటున్నారు. ఫలితంగా జనాలకు దూరంగా ఉంటారని దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లి సూసైడ్ థాట్స్ వస్తాయంటున్నారు.

News November 12, 2025

NIA, ఐబీ చీఫ్‌లతో అమిత్ షా భేటీ

image

ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో మరోసారి కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ, ఐబీ చీఫ్‌లతో తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. బ్లాస్ట్‌ దర్యాప్తుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం. అటు ఫరీదాబాద్-ఢిల్లీ బ్లాస్ట్ లింక్‌పై NIA ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసింది.

News November 12, 2025

స్లీపర్ సెల్స్ రూపంలో టెర్రరిజం: కిరణ్ బేడీ

image

పేదరికం, నిరుద్యోగంతో యువత ఉగ్ర, తీవ్రవాదాల వైపు మళ్లుతున్నారన్నది పాత వాదన. కానీ అదిప్పుడు వైట్ కాలర్ అఫెన్సుగా మారింది. తాజాగా పట్టుబడ్డవారంతా డాక్టర్లు, ప్రొఫెసర్లే. సరిహద్దుల్ని దాటి దేశంలో స్లీపర్ సెల్స్ రూపంలో టెర్రరిజమ్ వ్యాపించిందని మాజీ IPS కిరణ్ బేడీ ఇండియాటుడే చర్చలో పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమని, ప్రజల సహకారంతో అన్ని రాష్ట్రాల భద్రతా విభాగాలు ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించాలన్నారు.