News April 3, 2025
రూ.కోటి విరాళం ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు: TTD

AP: తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నట్లు TTD వెల్లడించింది. ఏడాదిలో 3రోజులు సుప్రభాత సేవ, 3 సార్లు బ్రేక్ , 4రోజులు సుపథం ప్రవేశ దర్శనాలు కల్పిస్తామంది. రూ.3వేల వసతి గృహంలో 3రోజుల పాటు ఉండొచ్చని చెప్పింది. స్వామివారి లడ్డూలు, వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందొచ్చని తెలిపింది. అలాగే 5గ్రా. శ్రీవారి బంగారం, 50గ్రా. సిల్వర్ డాలర్ అందజేస్తామంది.
Similar News
News December 5, 2025
రాజకీయాల్లోకి రమ్మని లోకేశ్ను ఫోర్స్ చేయలేదు: CBN

AP: పిల్లల్లోని ఇన్నోవేటివ్ ఆలోచనలు గుర్తించేందుకు స్టూడెంట్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తామని CM CBN PTMలో తెలిపారు. ‘నేనెప్పుడూ లోకేశ్ స్కూలుకు వెళ్లలేదు. టీచర్లతోనూ మాట్లాడలేదు. ఫౌండేషన్ ఇప్పించానంతే. చదువుకొని మంత్రి అయ్యారు. రాజకీయాల్లోకి రమ్మనీ ఫోర్స్ చేయలేదు’ అని అన్నారు. కష్టంగా ఉంటుందన్నా విద్యాశాఖనే ఎంచుకున్నారని చెప్పారు. విద్యార్థులు కలలు సాకారం చేసుకొనేలా అండగా ఉంటామన్నారు.
News December 5, 2025
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 124 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<
News December 5, 2025
TG న్యూస్ రౌండప్

* కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్పై అభిప్రాయాలు సేకరించేందుకు రేపు తెలంగాణ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. దీనికి KTR హాజరవుతారు: బోయినపల్లి వినోద్
* కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇన్ఛార్జ్ VCగా డా.రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
* HYD శామీర్పేటలో ఓ కారు టైర్లు, సీట్ల కింద ₹4Cr నగదును పోలీసులు గుర్తించారు. హవాలా ముఠాను అరెస్టు చేసి విచారిస్తున్నారు.


