News October 31, 2024
రాష్ట్రాల్లో స్పెషల్ పిండి వంటలు!

దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించి టపాసులు పేల్చడమే కాదు. పిండి వంటలకూ ప్రత్యేకమే. పండుగ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వెరైటీ పిండి వంటలు, స్వీట్లు చేస్తుంటారు. అవేంటో తెలుసుకుందాం. TGలో అరిసెలు, APలో తీపి గవ్వలు, కర్ణాటకలో హొలిగె, తమిళనాడులో ఒక్కరాయ్ &దీపావళి మరుందు, ఒడిశాలో కాకరపిత్త& రసబలి, రాజస్థాన్లో మావ కచోరీ చేస్తుంటారు.
Similar News
News February 10, 2026
శ్రీశైలం మల్లన్న దర్శనానికి 4 గంటలు

AP: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం 12pm వరకు 32,870 మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 14,280మంది కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. 12,931మంది శివస్వాములు స్పర్శ దర్శనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పెరిగిన రద్దీ కారణంగా మల్లన్న దర్శనానికి 4గంటల టైమ్ పడుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
News February 10, 2026
రాహుల్ చూపించిన ఆ బుక్లో ఏముంది..?

MM నరవణె బుక్లోని ‘గల్వాన్ దాడి’ గురించి CARAVAN మ్యాగజైన్ పోస్ట్ చేసింది. ఆ కథనం ప్రకారం ‘చైనా సేన మన స్థావరాలకు 1km దూరంలో మోహరించింది. కానీ స్పష్టమైన ఆదేశాల్లేకుండా కాల్పులు చేయొద్దని ఢిల్లీ నిబంధన. దీంతో రక్షణ మంత్రి, NSA, MEAలకు ఫోన్లో విషయం చెప్పా. కాసేపటికి DM ఫోన్ చేసి మోదీతో మాట్లాడా ‘ఏది మంచిదన్పిస్తే అది చేయండి’ అన్నట్లు చెప్పారు. దీంతో PMకు స్పష్టత లేదు అన్పించింది’ అని MM భావించారట.
News February 10, 2026
IPLకూ హర్షిత్ రాణా డౌటే!

టీమ్ ఇండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా సోమవారం సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం జరుగుతున్న T20 వరల్డ్ కప్ నుంచి మాత్రమే కాకుండా త్వరలో రాబోయే IPL సీజన్ నుంచి కూడా ఆయన దాదాపు తప్పుకున్నట్లేనని తెలుస్తోంది. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో రాణా గాయపడ్డారు. త్వరలో బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిపోర్టు చేయనున్నారు.


