News March 25, 2025
ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు ప్రత్యేక పోర్టల్: కేంద్రమంత్రి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే చోట దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రమంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. దీనివల్ల ఉద్యోగార్థుల సమయం ఆదా అవటంతో పాటు సులభంగా అప్లై చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగాల రిక్రూట్ మెంట్ సగటు కాల వ్యవధిని 15 నెలల నుంచి 8నెలలకు తగ్గించామని వెల్లడించారు. మిషన్ కర్మయోగి పథకంలో ఇప్పటివరకు 89లక్షల ఉద్యోగులు చేరారని పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటన

ఏపీ, తెలంగాణలో పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొననున్నారు. 22న పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరగనున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరవుతారని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. తొలుత 21న హైదరాబాద్లో ‘భారతీయ కళామహోత్సవ్- 2025’ను రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. అనంతరం శనివారం పుట్టపర్తికి వెళ్లనున్నారు.
News November 20, 2025
చెరకు పంటను ఇలా నరికితే ఎక్కువ లాభం

చెరకు పంటను నరికేటప్పుడు గడలను భూమట్టానికే నరకాలి. కొన్ని ప్రాంతాల్లో భూమి పైన రెండు, మూడు అంగుళాలు వదిలేసి నరుకుతుంటారు. ఇలా చేయడం వల్ల రైతుకు నష్టం. మొదలు కణపులలో పంచదార పాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటు పంచదార అటు బెల్లం దిగుబడులు కూడా తగ్గుతాయి. చెరకును భూమట్టానికి నరికి ఖాళీ చేసిన తోటల్లో వేళ్లు లోతుగా చొచ్చుకెళ్లి తోట బలంగా పెరిగి వర్షాకాలంలో వచ్చే ఈదురు గాలులు, వర్షాలను కూడా తట్టుకుంటుంది.
News November 20, 2025
Op Sindoor: రఫేల్ జెట్లపై చైనా తప్పుడు ప్రచారం!

‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో చైనా తప్పుడు ప్రచారం చేసిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ‘ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నకిలీ ఫొటోలను చైనా వ్యాప్తి చేసింది. రఫేల్ యుద్ధ విమానాలను తమ క్షిపణులతో కూల్చేసినట్లుగా ప్రచారం చేసుకుంది’ అని US-చైనా ఎకనమిక్, సెక్యూరిటీ రివ్యూ కమిషన్
తెలిపింది. రఫేల్ జెట్లపై నమ్మకాన్ని దెబ్బతీసి, తమ J-35 విమానాలకు డిమాండ్ పెంచుకోవాలని చైనా కుట్ర పన్నినట్లు ఆరోపించింది.


