News July 4, 2024
తీర్మానాలతో ప్రత్యేక హోదా రాదు: కేంద్రమంత్రి

AP: ప్రత్యేక హోదా.. తీర్మానాలు చేస్తే వస్తే అంశం కాదని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. అలా అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలు తీర్మానాలు చేస్తాయన్నారు. హోదా అంశంపై ప్రధాని స్థాయిలో నిర్ణయం తీసుకోవాలన్నారు. బీహార్కు సైతం ఇదే వర్తిస్తుందన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే గతంలో ప్రత్యేక హోదా స్థానంలో ప్యాకేజీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆ నిధులతో AP అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
Similar News
News December 10, 2025
150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
అన్క్లెయిమ్డ్ అమౌంట్.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి: PM

బ్యాంకుల్లో ₹78,000Cr అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయని PM మోదీ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ₹14KCr, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వద్ద ₹3KCr మిగిలిపోయాయన్నారు. ఖాతాదారులు/ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు ‘యువర్ మనీ, యువర్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. UDGAM, బీమా భరోసా, SEBI, IEPFA పోర్టల్లలో వీటి వివరాలు తెలుసుకుని సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు.
News December 10, 2025
ఉప్పల్లో మెస్సీ పెనాల్టీ షూటౌట్

TG: లియోనెల్ మెస్సీ “GOAT టూర్ ఆఫ్ ఇండియా 2025″లో భాగంగా ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. సింగరేణి RR, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారని నిర్వాహకులు తెలిపారు. పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం 33,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.


