News April 8, 2025
వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెండు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. చర్లపల్లి నుంచి తిరుపతికి శుక్ర, ఆదివారాల్లో రా.9.35కు ట్రైన్ బయలు దేరనుండగా.. శని, సోమ వారాల్లో సా.4.35కు తిరుపతి నుంచి చర్లపల్లికి రైలు వెళ్లనుంది. ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.
Similar News
News April 8, 2025
హరీశ్ శంకర్తో బాలకృష్ణ మూవీ?

నందమూరి బాలకృష్ణ వరుసగా యువ దర్శకులకు అవకాశాలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హరీశ్ శంకర్తోనూ సినిమా చేయనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ సిద్ధమైందని సమాచారం. మరోవైపు హరీశ్ రామ్ పోతినేనితోనూ ఓ సినిమా చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను హరీశ్ కంప్లీట్ చేయాల్సి ఉంది.
News April 8, 2025
బాలీవుడ్ నటిపై వారెంట్ జారీ చేసిన కోర్టు

బాలీవుడ్ నటి మలైకా అరోరాపై ముంబైలోని ఓ కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2012లో నటుడు సైఫ్ అలీఖాన్, మలైకా, కరీనా తదితర స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్కి వెళ్లారు. అక్కడ మరో కస్టమర్తో గొడవ కాగా అతడిపై ఆయన దాడి చేశారు. అప్పటి నుంచీ ఆ కేసు విచారణలో ఉంది. సాక్షిగా ఉన్న మలైకా కోర్టుకు రాకపోవడంతో ఇప్పటికే ఓసారి వారెంట్ జారీ చేసిన కోర్టు, తాజాగా మరోసారి వారెంట్ ఇష్యూ చేసింది.
News April 8, 2025
ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదు: చైనా

మరో 50శాతం టారిఫ్ విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న బెదిరింపులకు తాము లొంగే ప్రసక్తి లేదని చైనా తేల్చిచెప్పింది. ‘ఒత్తిడి పెట్టడమనేది మాతో మాట్లాడే విధానం కాదు. ఈ విషయం ఇదివరకే చెప్పాం. సరైన పద్ధతిలో చర్చలు జరపాలి. మా హక్కులు, ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ చర్య నుంచైనా మమ్మల్ని మేం కాపాడుకుంటాం’ అని చైనా రాయబారి లియూ పెంగ్యూ స్పష్టం చేశారు.