News February 5, 2025

ఏపీ నుంచి తెలంగాణ మీదుగా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

image

జీవితంలో ఒక్కసారే వచ్చే మహా కుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే మరో 2 ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. మచిలీపట్నం-దానాపూర్ మధ్య ఈ నెల 8, 16 తేదీల్లో ఈ రైళ్లు ఉ.11 గంటలకు బయల్దేరనున్నాయి. అలాగే దానాపూర్-మచిలీపట్నం మధ్య ఈ నెల 10, 18 తేదీల్లో మ.3.15 గంటలకు తిరిగి బయల్దేరనున్నాయి. విజయవాడ, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల నాగ్‌పూర్, మీదుగా ఈ రైళ్లు ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నాయి.

Similar News

News February 8, 2026

రేవంత్‌ను చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారట: బండి సంజయ్

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ను గెలిపిస్తే అన్ని పన్నులు పెంచుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘బీజేపీని గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకొస్తా. ఢిల్లీ వెళ్తే రేవంత్‌ను అందరూ చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారట. అలాంటి వ్యక్తికి ఎవరైనా నిధులిస్తారా? ‘ అని చొప్పదండి ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. తనకు బీపీ, షుగర్ లేవని, తన వల్ల KCRకి అవి వచ్చాయని పేర్కొన్నారు.

News February 8, 2026

జైపూర్‌లోని ESIC హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

జైపూర్‌లోని <>ESIC<<>> హాస్పిటల్ 43 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల వారు ఫిబ్రవరి 25న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS+PG/DNB/డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.225. SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

News February 8, 2026

JEE మెయిన్ ‘కీ’లో 17 తప్పులు? బోనస్ మార్కుల కోసం డిమాండ్

image

JEE మెయిన్ 2026 సెషన్-1 ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లో 17 తప్పులున్నాయని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. ఫిజిక్స్‌లో ఎక్కువ పొరపాట్లు దొర్లాయని, వీటి వల్ల విద్యార్థుల ర్యాంకులు తలకిందులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తప్పుగా ఉన్న 10 ప్రశ్నలకు బోనస్ మార్కులు ఇవ్వాలని, మిగిలిన 7 ప్రశ్నల సాంకేతిక లోపాలను సరిదిద్దాలని NTAను డిమాండ్ చేసింది. Feb 12న తుది ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.