News January 28, 2025

HYD నుంచి కుంభమేళాకు స్పెషల్ రైళ్లు

image

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం SCR 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి-దానాపూర్ మధ్య ఫిబ్రవరి 5, 7 తేదీల్లో దానాపూర్-చర్లపల్లి మధ్య 7,9 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. తెలంగాణలో జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.

Similar News

News October 16, 2025

48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: ఉత్తమ్

image

TG: ఖరీఫ్ సీజన్‌లో 8,342 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పారు. అలాగే సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తామన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలతో పాటు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
* అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 16, 2025

రబీ మొక్కజొన్న సాగుకు అనువైన రకాలు

image

రబీ మొక్కజొన్నను OCT-15 నుంచి NOV-15 వరకు విత్తుకోవచ్చు. మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక(100-120), మధ్యకాలిక(90-100), స్వల్పకాలిక( 90 రోజుల కంటే తక్కువ) రకాలున్నాయి. రబీ మొక్కజొన్న సాగుకు అనువైన రకాలు D.H.M.111, D.H.M.115, D.H.M.117, D.H.M.121.
☛ హైబ్రిడ్ రకాలు: DHM-103, DHM-105, DHM-107, DHM-109
☛ కాంపోజిట్ రకాలు: అశ్విని, హర్ష, వరుణ్, అంబర్ పాప్‌కార్న్, మాధురి, ప్రియా స్వీట్‌కార్న్

News October 16, 2025

భూ రక్షకుడు ఆ వేంకటేశుడే..

image

వేంకటాచల మాహాత్మ్యం ప్రకారం.. పూర్వం లోకం అంతమయ్యే సమయంలో సూర్యుడు రుద్రమూర్తి రూపంలో భూమిని మండించాడు. దీంతో చాలా ఏళ్లు వర్షాలు లేక భూమి ఎండిపోయింది. అడవులు, పర్వతాలు బూడిదయ్యాయి. ఆ తర్వాత భయంకర గాలి వీచి, భారీ వర్షాలు కురిసి, జలప్రళయం వచ్చింది. భూమి మొత్తం నీట మునిగింది. అప్పుడు హరి శ్వేత వరాహ రూపంతో సంద్రంలోకి ప్రవేశించి, పాతాళం వరకు వెళ్లి, మునిగిపోయిన భూమిని పైకి తీసుకొచ్చారు.<<-se>>#VINAROBHAGYAMU<<>>