News December 25, 2024
మహాకుంభమేళాకు విశాఖ నుంచి స్పెషల్ ట్రైన్లు

JAN 13 నుంచి FEB 26 వరకు ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళాకు విశాఖ నుంచి 9 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఈస్ట్ కోస్టల్ రైల్వే వెల్లడించింది. విశాఖ-గోరఖ్పుర్ మధ్య JAN 5, 19, 16 తేదీల్లో 08562 నంబర్ రైలు ప్రయాణిస్తుందని తెలిపింది. విశాఖ-దీన్దయాళ్ స్టేషన్ల మధ్య 08530 నంబర్ రైలు JAN 9, 16, 23, FEB 6, 20, 26 తేదీల్లో నడుస్తుందని పేర్కొంది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు సూచించింది.
Similar News
News December 8, 2025
రూ.7,887 కోట్లు అకౌంట్లలో జమ

TG: వరి సేకరణలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 41.6 లక్షల టన్నుల వరి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 8,401 PPCలలో 7.5 లక్షల మంది రైతులకు 48 గంటల్లోనే రూ.7,887 కోట్లు చెల్లించామని తెలిపారు. వరి కొనుగోళ్లలో 45% ఐకేపీ మహిళల భాగస్వామ్యంతో మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.
News December 8, 2025
తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. చంద్రబాబు విషెస్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెప్పారు. ఈరోజు, రేపు జరిగే ఈ సదస్సు తెలంగాణ అభివృద్ధి, పురోగతి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నానని Xలో పోస్టు చేశారు. కాగా ఈ మధ్యాహ్నం గవర్నర్ జిష్ణుదేవ్ ఈ సమ్మిట్ను ప్రారంభించనున్నారు.
News December 8, 2025
వర్షాలు, చలి.. కోళ్ల పెంపకందారులకు సూచనలు

ప్రస్తుతం కొన్నిచోట్ల కురుస్తున్న వర్షాలు, చలి వల్ల కోళ్లకు వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అందుకే కోళ్ల ఫారాన్ని శుభ్రంగా ఉంచి, నీరు బయటకు పోయేలా డ్రైనేజ్ సక్రమంగా ఉండేట్లు చూడాలి. కోళ్లకు నీరందించే నీటి బుట్టలు లీక్ కాకుండా చూసుకోవాలి. లిట్టర్ బాగా తడిగా ఉంటే దాన్ని వెంటనే తొలగించాలి. ఫారంలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. కోళ్లలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెటర్నరీ డాక్టరును సంప్రదించాలి.


