News March 23, 2024
హోళీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710941304583-normal-WIFI.webp)
హోళీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 23 నుంచి 27 వరకు ఈ రైళ్లు నడవనున్నట్లు పేర్కొంది. 23న హైదరాబాద్-ధనపూర్, 25న సంత్రాగచి-సికింద్రాబాద్, 26న ధనపూర్-హైదరాబాద్, 24న సంత్రాగచి-చెన్నై సెంట్రల్, 27న పట్నా-కోయంబత్తూర్ మధ్య రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది.
Similar News
News July 8, 2024
ఏపీ టెట్ షెడ్యూల్లో మార్పులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32023/1679908557526-normal-WIFI.webp)
AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) షెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. జులై 2న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ జరగాల్సి ఉండగా, ఆ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని తెలిపింది. ప్రిపరేషన్కు సమయం కోసం అభ్యర్థుల వినతి మేరకు సవరణ నోటిఫికేషన్ను ఇవాళ రిలీజ్ చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
News July 8, 2024
ఏపీ టెట్ కొత్త షెడ్యూల్ ఇదే..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_52024/1716136465853-normal-WIFI.webp)
✒ పరీక్ష ఫీజు చెల్లింపు: ఇప్పటికే ప్రారంభం కాగా ఆగస్టు 3 వరకు అవకాశం
✒ ఆన్లైన్ దరఖాస్తులు: ఆగస్టు 3 వరకు
✒ ఆన్లైన్ మాక్టెస్ట్: సెప్టెంబర్ 19 నుంచి
✒ పరీక్షలు: అక్టోబర్ 3 నుంచి 20 వరకు(2 సెషన్లలో)
✒ ప్రొవిజినల్ కీ: అక్టోబర్ 4నుంచి
✒ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్ 5 నుంచి
✒ తుది కీ విడుదల: అక్టోబర్ 27
✒ ఫలితాలు విడుదల: నవంబర్ 2న
News July 8, 2024
స్మృతి మంధాన లవర్ ఇతనే..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720430361885-normal-WIFI.webp)
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో రిలేషన్ను మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్ఛల్ అధికారికంగా ప్రకటించారు. తమ ప్రేమ బంధానికి ఐదేళ్లు పూర్తయ్యాయని తెలుపుతూ వారిద్దరూ కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశారు. ఆ పోస్ట్కు మంధాన లవ్ సింబల్స్తో కామెంట్ చేసింది. కాగా స్మృతి, పలాష్ పలుమార్లు కలిసి కనిపించినా తమ బంధంపై ఎప్పుడూ నోరువిప్పలేదు.