News August 31, 2024
సీఎం మార్పుపై జోరందుకున్న ఊహాగానాలు

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ముడా స్కాం, వాల్మీకి కోఆపరేషన్ స్కాం ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం సీఎంను మారుస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో డిప్యూటీ CM DK శివకుమార్, హోం మంత్రి పరమేశ్వర వర్గాలు ఎవరికివారు తమ నేతకు పదవి దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నాయి. పరమేశ్వర్కు CM పదవి దక్కితే సంతోషిస్తానని మంత్రి రాజన్న చెప్పడం గమనార్హం.
Similar News
News November 23, 2025
RBIలో మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

<
News November 23, 2025
వన్డేలకు కొత్త కెప్టెన్ను ప్రకటించిన టీమ్ ఇండియా

దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు భారత జట్టుకు కొత్త కెప్టెన్ను BCCI ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్కు రాహుల్ సారథిగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. బుమ్రా, సిరాజ్కు రెస్ట్ ఇవ్వగా గిల్, అయ్యర్ గాయాలతో దూరమయ్యారు.
జట్టు: రోహిత్, జైస్వాల్, కోహ్లీ, తిలక్ వర్మ, రాహుల్(C), పంత్(VC), సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, రుతురాజ్, ప్రసిద్ధ్, అర్షదీప్, ధ్రువ్ జురెల్.
News November 23, 2025
ఒకే వేదికపై కేటీఆర్, కవిత?

అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత ఒకే వేదికపై కనిపించే అవకాశముంది. ఈ నెల 25న చెన్నైలో ‘ABP నెట్వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్’కు హాజరుకావాలని వీరికి ఆహ్వానం అందింది. ఇప్పటికే KTR వెళ్తానని ప్రకటించగా, కవిత కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టైమింగ్స్ ఖరారు కావాల్సి ఉండగా వీరిద్దరూ ఒకే వేదికపై ఎదురుపడతారా అనేది ఆసక్తికరంగా మారింది. BRSను వీడాక కవిత, KTRను ఏ సందర్భంలోనూ కలుసుకోని సంగతి తెలిసిందే.


