News February 3, 2025
ఆత్మీయ భరోసా.. నిలిచిపోయిన డబ్బుల జమ?

TG: MLC ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ కారణంగా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ డబ్బుల జమ నిలిచిపోయినట్లు సమాచారం. తొలి విడతలో 18,180 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ₹10.90crకు పైగా ప్రభుత్వం జమ చేసింది. ఈ స్కీమ్కు 5.80L మందిని ఇప్పటికే అర్హులుగా గుర్తించింది. కొత్త దరఖాస్తులను పరిశీలిస్తోంది. కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా ఆ ఫ్యామిలీలోని వారిని అనర్హులుగా గుర్తిస్తున్నట్లు సమాచారం.
Similar News
News March 29, 2026
IPL: టాస్ గెలిచిన MI

ముంబైలోని వాంఖడే స్టేడియంలో KKRతో జరుగుతున్న మ్యాచ్లో MI టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
MI: రోహిత్, రికెల్టన్, తిలక్, హార్దిక్, రూథర్ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్, మార్కండే, ఘజన్ఫర్, బౌల్ట్, బుమ్రా
KKR: అలెన్, రహానే, గ్రీన్, రఘువంశీ, రింకూ, రమణ్దీప్, అనుకుల్ రాయ్, నరైన్, వరుణ్, అరోరా, ముజరబానీ
News March 29, 2026
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఫలితాలు విడుదల

TG: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెరిట్ జాబితా విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 1న HYDలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఇందులో గైనకాలజీ, అనస్తీషియా వంటి కీలక విభాగాలున్నాయి. ఇక 2,312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను ఏప్రిల్ 9న వెల్లడిస్తామని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ నియామకాలతో ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
News March 29, 2026
మహిళలకు రూ.2 వేలు, రైతులకు పంపుసెట్లు: DMK మ్యానిఫెస్టో

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అధికార డీఎంకే వరాల జల్లు కురిపించింది. మహిళలకు ప్రతి నెలా ₹2 వేలు ఇస్తామని ప్రకటించింది. పెన్షన్ను ₹2 వేలకు పెంచుతామని, రైతులకు ఉచితంగా పంపుసెట్లు అందజేస్తామని తెలిపింది. మహిళా సంఘాలకు ₹5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామని పేర్కొంది. స్టూడెంట్లకు ఫ్రీగా ల్యాప్టాప్లు, 8వ తరగతి వరకు పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేస్తామని వెల్లడించింది.


