News August 7, 2024
SPIRITUAL: చదువుల తల్లి కొలువైన బాసర

బాసరలో సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని స్వయంగా వ్యాస మహర్షి ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. మహాభారత యుద్ధంలో ప్రాణనష్టాన్ని చూసి మనోవ్యథతో గోదావరి తీరానికి వచ్చి తపస్సు చేసినట్లు గాథ. మూడు పిడికిళ్ల ఇసుకను మూడు చోట్ల కుప్పలుగా పోశారని.. అవే సరస్వతి, లక్ష్మి, కాళికా దేవి ప్రతిమలుగా మారాయని ప్రతీతి. నిర్మల్ జిల్లాలోని ఈ పుణ్యక్షేత్రం చిన్నారుల అక్షరాభ్యాసాలకు నెలవు.
Similar News
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.
News September 18, 2025
విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ

ఇంటర్నేషనల్ టీ20ల్లో నమీబియా ఓపెనర్ ఫ్రైలింక్ విధ్వంసం సృష్టించారు. జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో కేవలం 13 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు మొత్తం 31 బంతుల్లో 77 రన్స్ చేసి ఔట్ అయ్యారు. 6 సిక్సర్లు, 8 ఫోర్లు బాదారు. ఫ్రైలింక్ బాదుడుతో నమీబియా 20 ఓవర్లలో 204/7 రన్స్ చేసింది. ఛేజింగ్లో జింబాబ్వే ఎదురొడ్డుతోంది.