News August 4, 2024
SPIRITUAL: ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు

కన్నవారి సేవకు మించిన భగవత్సేవ ఉండదని చెబుతుంది సనాతన ధర్మం. తల్లిదండ్రులైన శివపార్వతులకు ప్రదక్షిణతో గణేశుడు మహాగణాధిపతి అయ్యాడు. పితృవాక్పరిపాలనతో శ్రీరాముడు ఆదర్శప్రాయుడయ్యాడు. అంధులైన తల్లిదండ్రుల సేవతో శ్రవణ కుమారుడు.. కాశీ, గంగ కంటే తన కన్నవారి పాదసేవే పరమోత్కృష్టమని కుక్కుటముని చాటిచెప్పారు. అమ్మానాన్నలపై కరుణ లేని మనిషికి ఇహపరాల్లో సుఖం, భగవదనుగ్రహం దక్కదనేది పెద్దల మాట.
Similar News
News February 2, 2026
అన్నిటికీ నేనే మాట్లాడాలా? మరి మీరెందుకు: పార్టీ నేతలపై పవన్ ఆగ్రహం

AP: పార్టీ నేతలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో YCP దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం లేదని మండిపడ్డారు. ‘అన్నిటికీ నేనే మాట్లాడితే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నది ఎందుకు? వైసీపీ దుష్ప్రచారంపై మీరు మాట్లాడాలి కదా?’ అని నిలదీశారు. మహిళల విషయంలో పార్టీనేతలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
News February 2, 2026
రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం: CM రేవంత్

TG: ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ పేరిట PM మోదీ రాజ్యాంగాన్నే మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని CM రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ‘వన్ పర్సన్.. వన్ పార్టీ’ విధానాన్ని తెచ్చేందుకు BJP ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని తొలగించేందుకే 400 సీట్లు అడిగారని అందుకే ప్రజలు వారికి సింపుల్ మెజార్టీ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఓటు హక్కును కాలరాయడానికి ‘SIR’ పేరిట ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.
News February 2, 2026
టూరిస్ట్ స్పాట్గా డంప్యార్డ్.. ఎలా మారింది?

రాజస్థాన్లోని కిషన్గఢ్ డంపింగ్ యార్డ్ ఇప్పుడు SMలో సెన్సేషన్గా మారింది. ‘రాజస్థాన్ స్విట్జర్లాండ్’గా పిలిచే ఈ ప్రాంతం నిజానికి మార్బుల్ వ్యర్థాల డంప్యార్డ్. మార్బుల్ కటింగ్ నుంచి వచ్చే తెల్లటి పౌడర్ కొండల్లా పేరుకుపోయి వర్షపు నీరు చేరడంతో అచ్చం మంచు కొండల మధ్య నీటి సరస్సులా కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఇన్స్టా రీల్స్, సినిమా షూటింగ్స్కి అడ్డాగా మారింది. ఈ డస్ట్ ఆరోగ్యానికి ప్రమాదకరం.


