News January 29, 2025
SPMVV : స్కాలర్షిపులకు దరఖాస్తు ఆహ్వానం

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో 2023-24 విద్యా సంవత్సరానికి పూర్ గర్ల్ ఎయిడ్ ఫండ్ (Poor Girl Aid Fund) కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. ఇదివరకు ఎటువంటి స్కాలర్షిప్లు రాని డిగ్రీ, పీజీ విద్యార్థినులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 31.
Similar News
News December 4, 2025
పాలమూరు: GP ఎన్నికలు.. లెక్క తప్పితే వేటు తప్పదు..!

స్థానిక ఎన్నికల నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన ప్రచార ఖర్చులను సర్పంచ్కి రూ.2.5లక్షల నుంచి రూ.1.5లక్షల వరకు ఈసీ ఖరారు చేసింది. గ్రామాల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా లెక్కకు మించి భారీగా వెచ్చిస్తున్నారు. దీంతో డబ్బు ప్రవాహం కట్టడికి ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసి పరిశీలిస్తోంది. వ్యయ పరిమితి దాటితే వేటు తప్పదు జాగ్రత్త.
News December 4, 2025
భూసేకరణకు పీసా కమిటీ ఆమోదం తీసుకోవాలి: కలెక్టర్

ఏలూరు జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు చేసే భూసేకరణకు సంబంధిత గ్రామాలలో పీసా కమిటీ సమావేశాలు నిర్వహించి ఆమోదం తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి పోలవరం ప్రాజెక్టు, ఆర్అండ్ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణానికి, సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్ల ఏర్పాటు నిమిత్తం భూసేకరణపై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.
News December 4, 2025
రైతన్నా.. పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు

పంటకాలం పూర్తయ్యాక చాలా మంది రైతులు ఆ వ్యర్థాలను తగలబెడుతుంటారు. వీటిని తొలగించడానికి అయ్యే ఖర్చును భరించలేక ఇలా చేస్తుంటారు. అయితే దీని వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పంటకు మేలు చేసే కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు, నులిపురుగులు నాశనమవుతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గుతుంది. ఈ వ్యర్థాలను పంటకు మేలు చేసే ఎరువులుగా మార్చే సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


