News October 26, 2025
SPMVV: ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్ ప్రారంభం

SPMVVలో UG/ PG కోర్సుల్లో మూడో విడత ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని కార్యాలయం పేర్కొంది. మొదటి రెండు విడతల్లో సీట్లు పొందని వారికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. B.Voc ఫ్యాషన్ టెక్నాలజీ, న్యూట్రిషన్ హెల్త్ కేర్ సైన్స్, ఇంటిగ్రేటెడ్ ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు నేటి(ఆదివారం)లోగా https://oamdc-apsche.aptonline.in/OAMDC202425/Index పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News October 28, 2025
గద్వాల: భారీ వర్షాలు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

తుఫాను ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి.ఎం.సంతోష్ అధికారులను ఆదేశించారు. ఆరబెట్టిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు.
News October 28, 2025
గుంటూరు జిల్లా ప్రయాణికులకు ముఖ్య గమనిక

గుంటూరు మీదు నవంబర్లో పలు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్-అనకాపల్లి రైలు (07055) నవంబర్ 6 నుంచి 27 వరకు ప్రతి గురువారం, తిరుగు రైలు (07056) నవంబర్ 7 నుంచి 28 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. కాకినాడ-మైసూరు రైళ్లు (07033, 07034) నవంబర్ 3 నుంచి 29 వరకు నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా ప్రయాణిస్తాయి. అదనంగా నవంబర్ 13, 14 తేదీల్లో యలంక-అనకాపల్లి రైళ్లు కూడా నడవనున్నాయి.
News October 28, 2025
HYD: పోస్ట్ ఆఫీసుల్లో రాత్రి 9 వరకు ఆధార్ సేవలు

HYDలోని జనరల్ పోస్ట్ ఆఫీసుల్లో ఆధార్ సేవా కేంద్రాలు ఉ.8 నుంచి రాత్రి 9 గం. వరకు పనిచేస్తున్నట్లు చీఫ్ పోస్ట్ మాస్టర్ వై.ప్రసాద్ తెలిపారు. ఆధార్ అనుసంధానం ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారిందన్నారు. పేరు, ఇంటి పేరు, చిరునామా, మొబైల్ నంబర్ సవరణల కోసం ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆలస్యం చేయకుండా దగ్గర్లోని పోస్ట్ ఆఫీసులో సంప్రదించండి. SHARE IT


