News April 15, 2025
అమరావతిలో 1,600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ!

AP: అమరావతి ప్రాంతంలో 1,600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ బ్రిడ్జి పక్కనే దీనిని ఏర్పాటు చేస్తారని సమాచారం. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టేడియాలు, స్పోర్ట్స్ వర్సిటీ, స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాంతంలోనే 1.25 లక్షల మంది కెపాసిటీ గల భారీ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించనున్నారు.
Similar News
News April 16, 2025
పీఎం ఇంటర్న్షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు

పీఎం ఇంటర్న్షిప్ స్కీం దరఖాస్తుల గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఈనెల 22 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఈ స్కీంలో భాగంగా నిరుద్యోగ యువతకు దేశంలోని 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పిస్తుంది. ఏడాది పాటు నెలకు రూ.5 వేల చొప్పున డైరెక్ట్గా అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. https://pminternship.mca.gov.in/login/ సైట్లో అప్లై చేసుకోవచ్చు. 21-24 ఏళ్లవారు అర్హులు.
News April 16, 2025
IPL: టాస్ గెలిచిన రాజస్థాన్

IPLలో భాగంగా ఈరోజు ఢిల్లీలో DCతో RR తలపడుతోంది. రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 5 మ్యాచులాడి ఒకటే ఓడిన DC రెండో స్థానంలో ఉండగా 6 మ్యాచుల్లో 2 గెలిచిన RR 8వ స్థానంలో ఉంది.
DC: జేక్, పోరెల్, కరుణ్, రాహుల్, స్టబ్స్, అశుతోశ్, అక్షర్, విప్రాజ్, స్టార్క్, కుల్దీప్, మోహిత్
RR: సంజూ, యశస్వీ, రాణా, పరాగ్, జురెల్, హెట్మెయిర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్, సందీప్
News April 16, 2025
మైనారిటీలంటే ముస్లింలే కాదు: కిరణ్ రిజిజు

భారత్లో మైనారిటీలంటే కేవలం ముస్లింలే కాదని, 6మతాలకు చెందినవారిని అల్పసంఖ్యాక వర్గాలుగానే పరిగణిస్తారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. మైనారిటీ శాఖ మంత్రి అయినందునే జాతీయ వక్ఫ్ కౌన్సిల్ ఛైర్మన్గా నియమించారన్నారు. కాగా ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో నియమించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ బోర్డుల్లో ముస్లింలను నియమిస్తారా? అని ప్రశ్నించింది.