News November 14, 2024
మండలిలో మా గొంతు నొక్కుతున్నారు: YCP ఎమ్మెల్సీలు

AP: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే తమను పదే పదే అడ్డుకుంటున్నారని YCP MLCలు ఆరోపించారు. మండలిలో తమ సభ్యులు మాట్లాడకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘మా నాయకుడు జగన్ ఎక్కడికీ పారిపోలేదు. ఆయన ప్రతిపక్ష హోదా అడిగితే ఇప్పటివరకు స్పీకర్ స్పందించలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆయన సభకు వచ్చి ఏం లాభం? మమ్మల్ని అవహేళనగా మాట్లాడటం సరికాదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.
News December 5, 2025
పీజీ సెట్ రాయకపోయినా అడ్మిషన్

AP: MA, M.Sc, M.Com కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పీజీ సెట్ అర్హతను మినహాయించింది. పీజీ సెట్ అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. వర్సిటీలు, కాలేజీల్లో మిగిలిన కన్వీనర్ కోటా సీట్లను ఈ స్పాట్ కోటా కింద ఫిల్ చేయాలని ఆదేశించింది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ వర్తించదు.


