News November 14, 2024
మండలిలో మా గొంతు నొక్కుతున్నారు: YCP ఎమ్మెల్సీలు

AP: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే తమను పదే పదే అడ్డుకుంటున్నారని YCP MLCలు ఆరోపించారు. మండలిలో తమ సభ్యులు మాట్లాడకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘మా నాయకుడు జగన్ ఎక్కడికీ పారిపోలేదు. ఆయన ప్రతిపక్ష హోదా అడిగితే ఇప్పటివరకు స్పీకర్ స్పందించలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆయన సభకు వచ్చి ఏం లాభం? మమ్మల్ని అవహేళనగా మాట్లాడటం సరికాదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
మహిళలకు నేడు వడ్డీ లేని రుణాల పంపిణీ

TG: 3.50 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వడ్డీ లేని రుణాలను అందించనుంది. ఇందుకోసం నిన్న సంఘాల ఖాతాల్లో రూ.304 కోట్లు జమ చేసింది. నేడు అన్ని నియోజకవర్గాల్లో ఉ.11 గంటలకు ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని Dy.CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం ఆ స్కీమ్ను పునరుద్ధరించామని పేర్కొన్నారు.
News November 25, 2025
నగదు విరాళాలపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు

రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే రూ.2 వేల లోపు నగదు విరాళాలకు ఐటీ మినహాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. నగదు రూపంలో విరాళాలు తీసుకుంటే ఎన్నికల గుర్తు కేటాయించబోమని, పొలిటికల్ పార్టీగా నమోదు చేయబోమని షరతులు విధించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం, ఈసీతోపాటు రాజకీయ పార్టీలకు సుప్రీం నోటీసులిచ్చింది.
News November 25, 2025
GAIL (INDIA) లిమిటెడ్లో ఉద్యోగాలు

<


