News January 27, 2025
SRCL: ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించుటకు తగిన ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని SRCLకలెక్టర్ సందీప్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై సోమవారం సంబంధిత అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆయా శఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News November 24, 2025
BHPL: 61 దరఖాస్థులను స్వీకరించిన అదనపు కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్థుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడీవోసీలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, ప్రజల నుంచి 61 దరఖాస్థులను ఆయన స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్థులు పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారం కల్పనకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News November 24, 2025
రామసముద్రం యువతి బెంగళూరులో దారుణ హత్య

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలానికి చెందిన విద్యార్థిని బెంగళూరులో హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగు చూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. రామసముద్రం (M) బిక్కంగారిపల్లికి చెందిన దేవిశ్రీ (21) బెంగళూరులో BBA చదువుతోంది. ఈ క్రమంలో విద్యార్థితో చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్ద కొండామర్రికి చెందిన ప్రేమ్ వర్ధన్ పరిచయం పెంచుకున్నాడు. వారి మధ్య ఏం జరిగిందో తెలిదు.. నిన్న రాత్రి హత్య చేసి పరారయ్యాడు.
News November 24, 2025
మహిళల పేరున సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం: సీతక్క

భూపాలపల్లి జిల్లాలో మహిళా సంఘాలకు ఇప్పటివరకు 6 బస్సులను ఇచ్చామని, వారికి నెలకు రూ.70 వేల వరకు ఆదాయం వస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతూ.. మూడున్నర ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మహిళల పేరున మంజూరు చేయనున్నట్లు తెలిపారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.6 కోట్ల వడ్డీలేని రుణాన్ని అందిస్తామన్నారు.


