News October 25, 2025
SRCL: ‘కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి’

ఈ ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం, పత్తి, మక్కలు ఇతర పంటల కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ఆయా పంటల ఉత్పత్తుల సేకరణ, చేయాలిసిన ఏర్పాట్లు తదితర అంశాలపై పౌరసరఫరాల శాఖ, సహకార శాఖ, ఐకేపీ, మెప్మా, డీసీఎంఎస్ తదితర అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయంలో ఇన్చార్జి కలెక్టర్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News October 25, 2025
‘ఎస్ఐఆర్’ పకడ్బందీగా రూపొందించాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను పకడ్బందీగా తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, అదనపు ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు. శనివారం రిటర్నింగ్ అధికారులతో ఎస్ఐఆర్పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్లో భాగంగా కేటగిరి ‘ఏ’ను బీఎల్ఓ యాప్ ద్వారా ధ్రువీకరిస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
News October 25, 2025
అన్నమయ్య జిల్లాలోని పాఠశాలలకు సెలవులు

భారీ వర్షాల కారణంగా కలెక్టర్ సూచనలతో అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 27, 28 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ డీఈవో సుబ్రహ్మణ్యం నేడు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమాచారాన్ని అన్ని డివిజన్ల విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారుల వారి పరిధిలోని హెచ్ఎంలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆదివారం కూడా సెలవు కావడంతో పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవు వచ్చాయి.
News October 25, 2025
పర్యాటక హోమ్ స్టే నమూనాల అభివృద్ధికి చర్యలు: కలెక్టర్

జిల్లాలో పర్యాటక హోమ్ స్టే నమూనాలను సేకరించి, పైలెట్ ప్రాజెక్టుగా ఒక హోం స్టే గృహాన్ని అభివృద్ధి చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. పర్యాటకులకు సనాతన వారసత్వ సంస్కృతి, సాంప్రదాయ అనుభూతిని అందించేలా ఈ చర్యలు ఉండాలని ఆయన కోరారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పర్యాటక రంగాభివృద్ధి కమిటీ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించి, జిల్లాలో పర్యాటకరంగా అభివృద్ధి అంశాలపై చర్చించారు.


