News August 24, 2025
SRCL: తండ్రి చితికి నిప్పుపెట్టిన కుమార్తె..!

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళ్లపల్లె గ్రామానికి చెందిన సాసాల రాజు(39) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. కాగా, తన పెద్ద కుమార్తె అశ్విత ఆయన చితికి నిప్పుపెట్టింది. ఈ దృశ్యం కుటుంబ సభ్యులతో పాటు బంధువులను కంటతడి పెట్టించింది. తండ్రికి తలకొరివి పెట్టడానికి కుమారుడు లేకపొవడంతో చిన్న వయస్సులోనే కూతురు తండ్రి చితికి నిప్పు పెట్టాల్సి వచ్చిందని స్థానికులు తెలిపారు.
Similar News
News August 24, 2025
ఖైరతాబాద్ మహాగణపతికి స్వాగతం చెప్పేందుకు సిద్ధం

వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతికి ఘన స్వాగతం చెప్పేందుకు నగర భక్తులు సిద్ధమయ్యారు. ఈ సంవత్సరం 69 అడుగుల గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. సోమవారం నేత్రోనిలం(కంటిపాప అమర్చడం) అనంతరం ఏకదంతుడికి స్వాగత కార్యక్రమలు ప్రారంభమవుతాయి. సాయంత్రం గణపతి ఆగమన్ నిర్వహించేందుకు ఖైరతాబాద్ యూత్ అసోసియేషన్ సిద్ధంగా ఉంది. 11 రోజుల పాటు మహాగణపతికి నగరవాసులను కనువిందు చేయనున్నాడు.
News August 24, 2025
ఆయుధాలు వాడకుండా ఉక్రెయిన్పై US ఆంక్షలు!

USమేడ్ లాంగ్-రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్(ATACMS)ని ఉక్రెయిన్ వాడకుండా అమెరికా ఆపుతోందని WSJ పేర్కొంది. రష్యాపై ATACMS వాడేందుకు US అనుమతి కావాలని షరతు పెట్టినట్లు తెలిపింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపలేకపోయానని ట్రంప్ ఫ్రస్ట్రేషన్తో ఉన్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. మరోవైపు రష్యాపై టారిఫ్స్ వేయడం లేదా శాంతి చర్చల నుంచి తప్పుకోవడంపై ఆలోచిస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.
News August 24, 2025
కడప: రేపటి నుంచి కౌన్సెలింగ్

కడప జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో సోమవారం నుంచి కౌన్సెలింగ్ జరుగుతుందని వీసీ డాక్టర్ విశ్వనాథ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. బీఎఫ్ఏ(ఫోర్ ఇయర్స్ డిగ్రీ) ఫైన్ ఆర్ట్స్ (యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, శిల్పం, బి. డెస్ ఇంటీరియర్ డిజైన్) కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.