News March 21, 2025
SRCL: CM దిష్టిబొమ్మ దహనం.. 15 మందిపై కేసు

చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేపట్టి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనలో 15 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈనెల 16న చందుర్తి మండల కేంద్రంలో అనుమతి లేకుండా రాస్తారోకో చేపట్టి సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎల్లయ్య, మాజీ ఎంపీపీ పెంటయ్య, మాజీ మార్కెట్ ఛైర్మన్ డప్పుల అశోక్ సహా పలువురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
Similar News
News November 18, 2025
NLG: అప్పుల బాధతో యువ రైతు SUICIDE

మునుగోడుకు చెందిన పిట్టల సురేందర్(30) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. 7 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. కూలీలను తీసుకొచ్చేందుకు EMI పద్ధతిలో రూ.3 లక్షలు పెట్టి ఆటో కూడా కొనుగోలు చేశాడు. అయితే, అధిక వర్షాల కారణంగా పంట నష్టం రావడంతో EMIలు, కౌలు చెల్లించలేక వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News November 18, 2025
NLG: అప్పుల బాధతో యువ రైతు SUICIDE

మునుగోడుకు చెందిన పిట్టల సురేందర్(30) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. 7 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. కూలీలను తీసుకొచ్చేందుకు EMI పద్ధతిలో రూ.3 లక్షలు పెట్టి ఆటో కూడా కొనుగోలు చేశాడు. అయితే, అధిక వర్షాల కారణంగా పంట నష్టం రావడంతో EMIలు, కౌలు చెల్లించలేక వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News November 18, 2025
అయిజ: డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహం

అయిజ పట్టణంలో మంగళవారం ఉదయం డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. అయిజ మున్సిపాలిటీ పరిధిలోని ఠాగూర్ స్కూల్ నుంచి మాధవ సినిమా టాకీస్ వైపు వెళ్లే రోడ్డు సమీపంలో ఉన్న డ్రైనేజీలో ఒక మగ మనిషి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


