News March 21, 2025
SRCL: CM దిష్టిబొమ్మ దహనం.. 15 మందిపై కేసు

చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేపట్టి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనలో 15 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈనెల 16న చందుర్తి మండల కేంద్రంలో అనుమతి లేకుండా రాస్తారోకో చేపట్టి సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎల్లయ్య, మాజీ ఎంపీపీ పెంటయ్య, మాజీ మార్కెట్ ఛైర్మన్ డప్పుల అశోక్ సహా పలువురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
Similar News
News November 4, 2025
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్తకోట(M) పాలెం, కానాయపల్లి గ్రామాల్లోని చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వెంటనే సీరియల్ నంబర్ల వారీగా ఎంత ధాన్యం తెచ్చారు, తేమ శాతం ఎంత ఉంది అనేది రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.
News November 4, 2025
పాపం.. చేయని తప్పుకు 43 ఏళ్లు జైలులోనే!

‘వందమంది దోషులు తప్పించుకున్నా.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు’ అని చెబుతుంటారు. కానీ చేయని తప్పుకు 43ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు USలోని భారత సంతతి వ్యక్తి సుబ్రహ్మణ్యం వేదం. 1980లో హత్య కేసులో జైలుపాలైన ఆయన ఇటీవలే నిర్దోషిగా రిలీజయ్యారు. అయితే దశాబ్దాల పాత డ్రగ్స్ కేసులో ఇమిగ్రేషన్ అధికారులు మళ్లీ ఆయన్ను అరెస్ట్ చేయడంతో కోర్టు జోక్యం చేసుకుంది. ఈ కేసును నిలిపివేసి ఆయనకు తాత్కాలిక ఊరటనిచ్చింది.
News November 4, 2025
KMR: ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల జిల్లా కమిటీ ఎన్నిక

తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేట్ అధ్యక్షుడిగా గడ్డం బాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం కామారెడ్డిలో విశ్రాంత ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కమిటీ నిర్ణయం తీసుకుంది. జిల్లా అధ్యక్షునిగా విట్టల్ రావు, ప్రధాన కార్యదర్శిగా నరసింహం, కోశాధికారిగా సలావుద్దీన్ ఫారూఖీ ఎన్నికయ్యారు. విశ్రాంత ఉద్యోగుల బాగు కోసం కృషి చేస్తానని అసోసియేట్ అధ్యక్షుడు తెలిపారు.


