News March 15, 2025
SRD: అలర్ట్.. పిల్లలపై కన్నేసి ఉంచండి

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వేసవి తాపం నేపథ్యంలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉంటాయి. ఒంటిపూట బడులు అంటే పిల్లలకు సరదా.. చెరువుల్లో, నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండి ఉన్నాయి. పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచండి. SHARE IT..
Similar News
News March 16, 2025
IPL: ఆ జట్టుకు బ్యాడ్ న్యూస్

మరో వారంలో ఐపీఎల్ ప్రారంభం కానుండగా రాజస్థాన్ రాయల్స్కు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్కు బెంగళూరులోని ఎన్సీఏ ఇంకా క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో 23న SRHతో మ్యాచుకు ఆయన దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆడినా బ్యాటింగ్ మాత్రమే చేస్తారు. వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. లేదంటే ఆయన స్థానంలో ధ్రువ్ జురెల్ బరిలోకి దిగొచ్చని వార్తలు వస్తున్నాయి.
News March 16, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల

నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటల కోసం ప్రాజెక్టు నుంచి 5వ విడత నీటిని విడుదల చేశారు. ఆయకట్టు కింద సాగవుతున్న పంటల సాగు కోసం ఇప్పటి వరకు 4విడతల్లో సుమారు 8టీఎంసీల నీటిని ఆయకట్టుకు అందించారు. ప్రస్తుతం ప్రధాన కాలువ ద్వారా ఐదో విడత నీటిని 1,213 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 1405.00 అడుగులకు 1396.75 అడుగుల, నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ సొలోమన్ తెలిపారు.
News March 16, 2025
విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే: కలెక్టర్

మెదక్ పట్టణంలో గిరిజన మినీ గురుకులాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇక్కడ పరిశుభ్రతా చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యార్థుల శ్రేయస్సు, బోధనా సామర్థ్యాలు, ఆహార భద్రత, తదితరాల వంటి వాటిని పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని తెలిపారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మమేకమై వారి విద్యా ప్రతిభను పరీక్షించి పలు సూచనలు చేశారు.