News March 15, 2025
SRD: అలర్ట్.. పిల్లలపై కన్నేసి ఉంచండి

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వేసవి తాపం నేపథ్యంలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉంటాయి. ఒంటిపూట బడులు అంటే పిల్లలకు సరదా.. చెరువుల్లో, నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండి ఉన్నాయి. పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచండి. SHARE IT..
Similar News
News March 16, 2025
విడుదలైన వారానికే OTTలోకి థ్రిల్లర్ మూవీ

మలయాళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్లో ఈ నెల 20 నుంచి తెలుగుతోపాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సినిమా ఈ నెల 14న తెలుగులో థియేటర్లలో విడుదలైంది. రిలీజైన వారంలోపే ఓటీటీ విడుదలకు సిద్ధం కావడం విశేషం. ఈ చిత్రంలో కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు.
News March 16, 2025
వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

✓VKB:ప్రజా సమస్యల పరిష్కారానికి పోరుబాట:జాన్ వెస్లీ.✓VKB: జిల్లావ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు 117 మంది గైర్హాజరు.✓VKB:అభివృద్ధికి సహకరిస్తున్న రైతులను అభినందించిన కలెక్టర్ ప్రతిక్ జైన్.✓TDR:త్రాగునీటి కోసం కాళీ బిందెలతో మహిళల నిరసన.✓VKB:ఈనెల 26న వాహనాల బహిరంగ వేలం పాట:ఎస్పి.✓ కుల్కచర్ల:పాంబండ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ.✓ జిల్లాలో ఘనంగా కాన్సిరాం జయంతి కార్యక్రమాలు.
News March 16, 2025
ఇది జగన్మాత ఆదేశం: పవన్ కళ్యాణ్

AP: భారతదేశ ఔన్నత్యాన్ని తెలిపేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ‘ఉత్తరాదినున్న హిమాలయాల్లో ఉంది ‘పరమశివుని’ కైలాసం. దక్షిణాది ఆయన కుమారుడు ‘మురుగన్’ నివాసం. వారు వెలిసిన ప్రదేశం ఈ ‘భారతదేశం’. ఇది జగన్మాత ఆదేశం’ అని పేర్కొన్నారు. ఉత్తర భారతానికి, దక్షిణాదికి తేడా లేదని చెప్పేందుకు పవన్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.