News March 15, 2025

SRD: అలర్ట్.. పిల్లలపై కన్నేసి ఉంచండి

image

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వేసవి తాపం నేపథ్యంలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉంటాయి. ఒంటిపూట బడులు అంటే పిల్లలకు సరదా.. చెరువుల్లో, నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండి ఉన్నాయి. పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచండి. SHARE IT..

Similar News

News March 16, 2025

మార్చి 16: చరిత్రలో ఈరోజు

image

*1764: తెలుగు భాష తొలి నిఘంటు కర్త మామిడి వెంకటాచార్యులు జననం * 1901: ప్రత్యేకాంధ్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు జననం *1917 ఆంధ్రప్రదేశ్ మెుదటి లోకాయుక్త ఆవుల సాంబశివరావు జననం *1963: భారత దేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎం. పతంజలి శాస్త్రి మరణం * 1993: ముంబైలో బాంబు పేలుళ్లు *1995: జాతీయ టీకా దినోత్సవం

News March 16, 2025

ADB: ఉచిత డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

నిరుద్యోగ బీసీ యువత కోసం బీసీ సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో రోడ్డు రవాణా సంస్థ ద్వారా ఉచిత హెవీ మోటర్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు తెలిపారు. HYD హకీంపేట్‌లో శిక్షణ ఉంటుందని, కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 31లోపు అన్ని ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులను ఆదిలాబాద్‌లోని కార్యాలయంలో సమర్పించాలన్నారు.

News March 16, 2025

ఆదిలాబాద్: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు

image

2025-26 విద్యాసంవత్సరానికి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DCO కీర్తి తెలిపారు. 6వ తరగతి ప్రవేశానికి 31 ఆగస్టు 2025 నాటికి విద్యార్థులకు 12 ఏళ్లకు మించకూడదన్నారు. SC, ST విద్యార్థులకు రెండేళ్లు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 31లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!