News January 29, 2025

SRD: ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాలు

image

సంగారెడ్డిలోని ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఆర్ఎం ప్రభులత మాట్లాడుతూ.. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు బస్సులను జాగ్రత్తగా నడపాలన్నారు. మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. నారాయణఖేడ్ డిపోలో పనిచేస్తున్న సయ్యద్‌కు ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అరుణ, అన్ని డీపోల డీఎంలు పాల్గొన్నారు.

Similar News

News December 6, 2025

భీమవరం: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి- కలెక్టర్

image

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనలో SHG మహిళలు అవగాహన కలిగి, యూనిట్ల స్థాపన ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటికే స్థాపించిన యూనిట్లకు ఆధునిక సాంకేతికతను జోడించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్దీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News December 6, 2025

హోంగార్డుల సేవలు అమూల్యం: సీపీ గౌష్ ఆలం

image

63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ గౌష్ ఆలం, శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని కొనియాడారు. అత్యవసర విధుల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు పంపిణీ చేశారు.

News December 6, 2025

కుల్కచర్ల: రాతపూర్వక హామీ ఇస్తేనే సర్పంచ్ పదవి !

image

కుల్కచర్ల మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం సరికొత్త మలుపు తిరిగింది. నామినేషన్లు దాఖలు చేసిన 338 మంది అభ్యర్థులకు ఓటర్ల నుంచి ఊహించని డిమాండ్ ఎదురవుతోంది. ఎన్నికల హామీలను ఇకపై కేవలం మాటల్లో చెబితే నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నారు. గ్రామ అభివృద్ధికి హామీలను పేపర్‌పై రాసి ఇస్తేనే సర్పంచ్‌ పదవి దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. దీంతో రాతపూర్వక హామీలపై అభ్యర్థులు తర్జనభర్జన పడుతున్నారు.