News February 1, 2025
SRD: గురుకుల ప్రవేశాలకు గడువు పొడిగింపు

ప్రభుత్వంలో వివిధ గురుకులాలలో ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు గాను ఈనెల 6 వరకు గడువు పొడిగించినట్లు TGSWREIS అధికారులు శనివారం తెలిపారు. గురుకులాల్లో ఐదవ తరగతి నుంచి 9వ తరగతి వరకు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలలో ప్రవేశం కోసం ఫిబ్రవరి 1 చివరి తేదీగా ఉండగా మరో 5 రోజులు గడువు పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News November 27, 2025
WGL: తొలి రోజు 705 నామినేషన్లు

ఉమ్మడి WGLలో తొలి రోజు సర్పంచ్ స్థానాలకు 467, వార్డు స్థానాలకు 238 నామినేషన్లు దాఖలయ్యాయి.
> వరంగల్- 91 సర్పంచ్లకు 101.. 800 వార్డులకు 37
> హనుమకొండలో 69 సర్పంచ్లకు 86.. 658 వార్డులకు 61
> జనగామలో 110 సర్పంచ్లకు 108.. 1,024 వార్డులకు 44
> మహబూబాబాద్లో సర్పంచ్లకు 105, వార్డులకు 41
> ములుగులో 48 సర్పంచ్లకు 22.. 420 వార్డులకు 20
> భూపాలపల్లిలో 82 సర్పంచ్లకు 45.. 712 వార్డులకు 35
News November 27, 2025
సిరిసిల్ల: ‘డిసెంబర్ 3న మహా ధర్నా విజయవంతం చేయండి’

జర్నలిస్టులకు ఇవ్వాల్సిన అక్రిడిటేషన్ కార్డుల జారీలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా డిసెంబర్ 3న హైదరాబాదులో తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని TUWJ (IJU) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యుడు దాసరి దేవేందర్ విజ్ఞప్తి చేశారు. హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు కూడా అందని ద్రాక్షగా మారాయని, జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.
News November 27, 2025
సిరిసిల్ల: నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల వద్ద, గంభీరావుపేట మండలం పెద్దమ్మ వద్ద, ముస్తాబాద్ వెంకట్రావు పల్లి వద్ద, వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ వద్ద, బోయినపల్లి మండలం నర్సింగాపూర్ వద్ద, రుద్రంగి మండలం మానాల క్రాస్ రోడ్ వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.


