News March 15, 2025

SRD: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

image

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థులకు నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్ పడ్డ స్కూల్స్‌లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఏప్రిల్ 23 వరకు ఈ హాఫ్‌డే స్కూల్స్ ఉంటాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు. జూన్12న పాఠశాలలు రీ-ఓపెన్.

Similar News

News November 10, 2025

వరుసగా అబార్షన్లు అవుతున్నాయా?

image

గర్భం దాల్చిన ప్రతిసారీ అబార్షన్ అవుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రెండోసారి అబార్షన్ జరిగితే డాక్టర్ పర్యవేక్షణలో టెస్టులు చేయించి మందులు వాడాలి. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని టెస్టుకి పంపి జన్యు సమస్యలున్నాయో తెలుసుకోవచ్చు. మేనరికంలో అయితే దంపతులకి టెస్టులు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు రక్తపరీక్షలు, స్కానింగ్, థైరాయిడ్ టెస్టులు జరిపి వాటికి తగ్గ ట్రీట్‌మెంట్ చేయాలి.

News November 10, 2025

తిరుపతి: “H.A.N.U.M.A.N” ప్రాజెక్ట్ అంటే ఏంటి…?

image

మానవ, అడవి జంతువుల ఘర్షణ పెరుగుతున్న నేపథ్యంలో AP ప్రభుత్వం “H.A.N.U.M.A.N” ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. Healing and Nurturing Units for Monitoring, Aid and Nursing of Wildlife అని అర్థం. ఈ ప్రాజెక్టు ద్వారా అడవి జంతువులతో జరిగే ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలు, పంటలు, పశువులను రక్షించడం ముఖ్య లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది.

News November 10, 2025

చిలుకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

image

చిలుకూరు మిట్స్ కాలేజీ సమీపంలో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బొలెరో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయాలపాలయ్యారు. సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సత్తుపల్లికి సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ, కోదాడ నుంచి హుజూర్నగర్ వెళ్తున్న బొలెరోను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.