News March 15, 2025

SRD: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

image

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థులకు నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్ పడ్డ స్కూల్స్‌లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఏప్రిల్ 23 వరకు ఈ హాఫ్‌డే స్కూల్స్ ఉంటాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు. జూన్12న పాఠశాలలు రీ-ఓపెన్.

Similar News

News April 20, 2025

Google: భారీగా భారత ఉద్యోగుల తొలగింపు!

image

గూగుల్ సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. హైదరాబాద్, బెంగళూరు ఆఫీసుల్లోని వందలాది మంది ఎంప్లాయిస్‌కు లేఆఫ్స్ ప్రకటించనున్నట్లు సమాచారం. వచ్చే వారం నుంచే జాబ్ కట్స్ మొదలవ్వొచ్చని బిజినెస్ స్టాండర్డ్ నివేదిక తెలిపింది. యాడ్స్, సేల్స్, మార్కెటింగ్ టీమ్స్‌పై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని తెలుస్తోంది.

News April 20, 2025

మనుబోలు: పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

image

మనుబోలు మండలంలోని వడ్లపూడి వద్ద ఆదివారం కారు బోల్తా పడి అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఐదుమంది ఉన్నారు. వీళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు. పొదలకూరు మండలం బిరదవోలు రాజుపాలెంకు చెందిన వారు కొత్త కారును కొనుగోలు చేసి గొలగమూడిలో పూజలు చేయించుకొని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

News April 20, 2025

కృష్ణా: LLB పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన LLB 3వ, 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం సూచించింది.

error: Content is protected !!