News March 5, 2025
SRD: పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు: ఎస్పీ

జిల్లాలో ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే 54 కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ రూపేష్ మంగళవారం తెలిపారు. 100 మీటర్ల వరకు 144 సెక్షన్ కూడా అమలులో ఉంటుందని పేర్కొన్నారు. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు పరీక్షలు జరిగే సమయంలో మూసి ఉంచాలని సూచించారు. నిబంధనలు ఉల్లంగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News December 8, 2025
రేణిగుంటకు వస్తున్న అన్ని విమానాలు.!

‘ఇండిగో’ విమానాల సంక్షోభంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తన సర్వీసులు రద్దైన విషయం విషయం తెలిసిందే. ఈ ప్రభావం రేణిగుంటలో సైతం కనిపించంది. ఇండిగో నిత్యం తిరుపతికి 10-12 సర్వీసులను నడుపుతుంది. ఈ సంక్షోభంతో 6 వరకు విమానాలు రద్దయ్యాయి. ఆదివారం నుంచి పరిస్థితి కుదుట పడింది. దీంతో రేణిగుంటకు పూర్తి స్థాయిలో విమానాలు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. టికెట్ ధరలు సైతం సాధారణ స్థాయికి చేరుకున్నాయి.
News December 8, 2025
HYDలో అక్కడ ఒక్క రూపాయికే టిఫిన్

HYDలోని రైల్వే స్టేషన్ పరిసరాల్లో భోజనం కోసం బిక్కు బిక్కుమంటూ తిరిగే వాళ్లెందరో. అలాంటి వారిని చూసి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ‘కరుణ కిచెన్’ జార్జ్ రాకేశ్బాబు రూపాయికే టిఫిన్ పెడుతున్నట్లు తెలిపారు. రోజూ మెనూ ఛేంజ్ చేస్తూ దాదాపు 300 మంది కడుపు నింపుతున్నారు. ఉ.7 గం.- 9 గం. వరకు 2 గంటలు కొనసాగుతోంది. ‘డబ్బు కోసం కాదు.. నలుగురి కడుపు నింపేందుకు. ఇందులోనే నా సంతోషం ఉంది’ అని తెలిపారు.
News December 8, 2025
రబీ వరి నాట్లు.. రైతులకు కీలక సూచనలు

వ్యవసాయ నిపుణుల సిఫారసు మేరకు ఎంపిక చేసుకున్న వరి రకాలకు చెందిన 21 రోజుల నారును సిద్ధం చేసిన పొలంలో మరీ లోతుగా కాకుండా పైపైన నాటుకోవాలి. నాట్లు వేసే ముందు నారు కొనలు తుంచడం వల్ల కాండం తొలుచు పురుగు గుడ్ల సముదాయాలు నాశనమవుతాయి. దీని వల్ల పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు. నారుమడులలో, వెదజల్లే పొలాల్లో నవంబర్-డిసెంబరులో భారీ వర్షాలకు ఎక్కువ నీరు బయటకు పోవడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి.


