News March 20, 2025

SRD: పరీక్ష కేంద్రాల 163 BNSS సెక్షన్: ఎస్పీ

image

జిల్లాలో ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ పారితోష్ పంకజ్ బుధవారం తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల వరకు ఐదుగురుకు మించి తిరగవద్దని చెప్పారు. పరీక్ష జరిగే సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లు మూసి ఉంచాలని పేర్కొన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.

Similar News

News November 26, 2025

ఏకగ్రీవాల కోసం సంప్రదింపులు.. గ్రామాల్లో ఎలక్షన్ HEAT

image

గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో వివిధ పార్టీల నాయకులు ఏకగ్రీవాల కోసం సంప్రదింపులు ప్రారంభించారు. తమ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించుకునేందుకు రంగంలోకి దిగారు. ప్రజలతో సత్సంబంధాలు ఉండి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్న అభ్యర్థులతో రాజీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్ తమ పార్టీ మద్దతుదారులను ఏకగ్రీవం చేస్తే రూ.10 లక్షల ప్రోత్సాహకం ప్రకటించిన విషయం తెలిసిందే.

News November 26, 2025

ఏకగ్రీవాల కోసం సంప్రదింపులు.. గ్రామాల్లో ఎలక్షన్ HEAT

image

గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో వివిధ పార్టీల నాయకులు ఏకగ్రీవాల కోసం సంప్రదింపులు ప్రారంభించారు. తమ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించుకునేందుకు రంగంలోకి దిగారు. ప్రజలతో సత్సంబంధాలు ఉండి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్న అభ్యర్థులతో రాజీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్ తమ పార్టీ మద్దతుదారులను ఏకగ్రీవం చేస్తే రూ.10 లక్షల ప్రోత్సాహకం ప్రకటించిన విషయం తెలిసిందే.

News November 26, 2025

బూర్గంపాడు: అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్య

image

రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన అథ్లెట్, అంగన్వాడీ కార్యకర్త బింగి కృష్ణవేణి(42) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడింది. బూర్గంపాడు మండలం కోయగూడెం గ్రామానికి చెందిన ఆమె.. ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో గొడవల కారణంగా మనస్తాపానికి గురై సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేశారు.