News October 22, 2025

SRD: అత్యధిక గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన శివాలి

image

రుద్రారం గీతం విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓరిగామి ప్రదర్శనను నిర్వహించి, తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవతో కలిసి రెండు కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారు. ఈ విజయంతో ఆమె మొత్తం 21 గిన్నిస్ రికార్డులను సాధించి, భారతదేశంలో అత్యధిక గిన్నిస్ రికార్డులు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

Similar News

News October 22, 2025

VKB: ఇద్దరు ఆడపిల్లలను ఒంటరిగా వదిలేసిన తండ్రి

image

వికారాబాద్ పట్టణంలో రాత్రి ఒంటరిగా ఉన్న ఇద్దరు ఆడపిల్లలను గుర్తించిన పోలీసులు చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బందికి అప్పగించారు. హైదరాబాద్ నుంచి కారులో వచ్చి ఎస్‌బీఐ బ్యాంక్ వద్ద తండ్రి తమను వదిలి వెళ్లినట్లు పిల్లలు తెలిపారు. వారు గుర్‌దొడ్ల తమ అమ్మమ్మ ఊరు అని చెప్పారు. దీంతో అధికారులు పిల్లలను శిశుగృహకు తరలించారు. తల్లిదండ్రుల ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు కోరారు.

News October 22, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. హోటళ్లకు భారీ డిమాండ్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కేవలం 17 రోజుల ప్రచార సమయం మిగిలి ఉండటంతో రాజకీయ వేడి పెరిగింది. అభ్యర్థులు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తూ అన్ని ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు వసతి కల్పించేందుకు జూబ్లీహిల్స్‌తో పాటు చుట్టుపక్కల హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఉప ఎన్నికల కారణంగా ఈ ప్రాంతంలో హోటల్ గదులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.

News October 22, 2025

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

image

AP: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 76,343 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 18,768 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా రూ.4.34 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.