News September 8, 2025
SRD: అమ్మ ఒడికి గణపయ్యా.. తాము తక్కువేం కాదయ్యా!

ఈ సృష్టికి జన్మ స్వరూపం స్త్రీ. అలాంటి మహిళలు ఏకమై గణనాథుడికి ప్రతిష్ఠించారు. మొదటి పూజ నుంచి చివరి రోజు వరకు వినాయకుడికి పూజ చేశారు. నిమజ్జన కార్యక్రమంలో కోలాటం వేస్తూ ఊరేగించారు. చివరకు గణపయ్యను ఆ గంగమ్మ ఒడిలోకి చేర్చించారు. రామచంద్రపురంలోని మహిళలు చేసిన అద్భుత దృశ్యాలను చూసి భక్తులందరూ ఆశ్చర్యపోయారు. మగవారికి తాము తక్కువేం కాదు అని నిరూపించారు.
Similar News
News September 9, 2025
విశాఖ: ‘అత్యాచార నిందితులకు కఠినంగా శిక్షిస్తాం’

మూగ బాలికపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్శన్ రాయపాటి శైలజ తెలిపారు. కేజీహెచ్లో మంగళవారం ఆమె బాధితురాలిని పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కామాధులకు కళ్ళు తెరిచేలా శిక్ష పడుతుందని అన్నారు.
News September 9, 2025
HYD: 2027 నాటికి 316 కోట్ల లీటర్ల వాటర్ డిమాండ్..!

HYDలో నీటి డిమాండ్ రానున్న రోజుల్లో భారీగా పెరగనుందని జలమండలి అంచనా వేసింది. ప్రస్తుతం రోజుకు 600 MGD నీరు అవసరం కాగా.. 2027 నాటికి 835 మిలియన్ గ్యాలన్లకు(316 కోట్ల లీటర్లు) డిమాండ్ పెరుగుతుందని తెలిపింది. 2047 నాటికి ఇది 1114 మిలియన్ గ్యాలన్లకు చేరుకుంటుందని అంచనాలు రూపొందించింది. ఇందులో భాగంగానే 2030 నాటికి 300 మిలియన్ గ్యాలన్ల అదనపు నీటిని నగరానికి తరలించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
News September 9, 2025
మంచిర్యాల: 11న మినీ జాబ్ మేళా

మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు. హైదారాబాద్లోని హెటేరో కంపెనీలో 40 జూనియర్ ఆఫీసర్, 100 జూనియర్ కెమిస్ట్ ట్రైనీ, 60 జూనియర్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆసక్తి కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.