News March 15, 2025

SRD: అలర్ట్.. పిల్లలపై కన్నేసి ఉంచండి

image

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వేసవి తాపం నేపథ్యంలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉంటాయి. ఒంటిపూట బడులు అంటే పిల్లలకు సరదా.. చెరువుల్లో, నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండి ఉన్నాయి. పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచండి. SHARE IT..

Similar News

News December 19, 2025

8% పెరిగిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల ఆదాయం

image

కేంద్ర ప్రత్యక్ష పన్నుల ఆదాయం 8% పెరిగినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ప్రకటించింది. ఏప్రిల్1 నుంచి డిసెంబర్17 వరకు రిఫండ్స్ అనంతరం ₹17 ట్రిలియన్లు సమకూరినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ కాలానికి పన్ను ఆదాయంలో 13% పెరుగుదల ఉంటుందని అంచనా వేయగా తక్కువగానే నమోదైంది. వ్యక్తిగత పన్ను రేటులో ఉపశమనం కలిగించినందున డైరెక్ట్ ట్యాక్స్ తగ్గినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

News December 19, 2025

ప్రకాశంలో పెద్ద మిస్టరీ.. 38408 కార్డుల కథేంటి..?

image

ప్రకాశం జిల్లాలో 38408 స్మార్ట్ రేషన్ కార్డుల యాజమానుల కోసం ఎదురుచూపుల్లో ఉన్నాయని అధికారుల వద్ద ఉన్న లెక్క. మొత్తం 651820 స్మార్ట్ కార్డులు రాగా, అక్టోబర్ 11న అధికారులు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. డీలర్లు, సచివాలయ సిబ్బంది ఇప్పటికి 613412 కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన 38408 కార్డుల సంగతి అధికారులు తేల్చాల్సిఉంది. కార్డులు తీసుకోనియెడల త్వరలో సరెండర్ చేసేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు.

News December 19, 2025

KNR: ఉన్నత చదువులకు కస్తూర్బా బాట..!

image

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం చూపుతున్నాయి. ఇంటర్‌తో ఎంసెట్, నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఉమ్మడి KNRలో శంకరపట్నం, రామడుగు, మర్రిపల్లి, సిరిసిల్ల, తంగళ్లపలి, రామగుండం, జూలపల్లి, సుల్తానాబాద్, కోరుట్ల, జగిత్యాల, ఇబ్రహీంపట్నం కేజీబీవీల్లో ఈ శిక్షణను ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్నారు.