News November 11, 2025
SRD: ఆఫ్ సెంచరీ తర్వాత.. ఆప్తుల చెంతకు!

15 ఏళ్ల వయస్సులో సొంతూరు, సొంతవాళ్లను వదిలి వెళ్లిన వ్యక్తి 50 ఏండ్ల తర్వాత తిరిగి తన ఆప్తులను వెతుక్కుంటూ సొంతూరికి వచ్చాడు. వివరాలిలా.. ఝరాసంగం మండలం బొప్పనపల్లి చెందిన కమ్మరి నాగప్ప, మోహనమ్మ దంపతుల చిన్న కుమారుడు సంగన్న తన 15వ ఏటా గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు. మహారాష్ట్ర నాసిక్ జిల్లాకు వెళ్లి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. హఠాత్తుగా తన సొంతూరికి రాగా గ్రామస్థులు సన్మానించారు.
Similar News
News November 11, 2025
‘విశాఖ వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి’

CII పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాట్ల నేపథ్యంలో విశాఖ CP కార్యాలయంలో ఇన్ఛార్జ్ CP గోపినాథ్ జెట్టి సోమవారం పోలీస్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. సమ్మిట్ కోసం నగరానికి రానున్న దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, ప్రముఖల కోసం తీసుకోవలసిన భద్రత చర్యలపై పలు సూచనలు చేశారు. నగరంలోకి ప్రవేశించే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలన్నారు.ట్రాఫిక్ జామ్లు కాకుండా చూడాలన్నారు.
News November 11, 2025
కేంద్ర బృందం తుఫాన్ నష్టాన్ని తీర్చేనా…!

బాపట్ల జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా భారీగా నష్టం చేకూరిందని అధికారుల ప్రాథమిక అంచన వేసిన విషయం తెలిసిందే. జిల్లాలో 80,467 ఎకరాలలో పంటకు నష్టం వాటిల్లింది. రోడ్లు, కాలువలు దాదాపుగా అన్ని ప్రాంతాలు కోతకు గురయ్యాయి. చాలామంది గుడిసెలలో నివసించే నిరుపేద ప్రజలు వరద కారణంగా తమ నివాసాలను కోల్పోయామన్నారు. కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి తుఫాన్ నష్టాన్ని తీరుస్తుందా అని ప్రజలు అంటున్నారు.
News November 11, 2025
MBNR: ఖో-ఖో సెలక్షన్స్.. విజేతలు వీరే..!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాల, బాలికలకు ఖో-ఖో ఎంపికలు నిర్వహించారు. మొత్తం 550 మంది క్రీడాకారులు పాల్గొనగా.. ఎంపికైన వారిని ఉమ్మడి జిల్లా స్థాయికి పంపించారు.
✒బాలికల విభాగం
1)మొదటి బహుమతి:బాలానగర్
2)రెండవ బహుమతి:మహమ్మదాబాద్
✒బాలుర విభాగం
1)మొదటి బహుమతి:నవాబ్ పేట్
2)రెండో బహుమతి:కోయిలకొండ


