News April 6, 2024

SRD: ఆర్గానిక్స్‌ పరిశ్రమలో ఉత్పత్తుల నమూనాల సేకరణ

image

చందాపూర్‌‌లోని ఆర్గానిక్స్‌ పరిశ్రమలో ఘటనా స్థలాన్ని నిన్న ఫోరెన్సిక్‌ లేబొరేటరీ AD వెంకట్‌రాజ్‌ పరిశీలించి ఉత్పత్తుల నమూనాలు సేకరించారు. సంగారెడ్డి MNR ఆస్పత్రిలో చందాపూర్‌కు చెందిన అశోక్‌సింగ్‌ చేతికి శస్త్రచికిత్స చేయగా మిగిలిన వారు ఇంటికెళ్లారని, సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రిలో 1, HYDలో ముగ్గురు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనలో 6 మంది మృతిచెందగా 16 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.

Similar News

News December 18, 2025

మెదక్ జిల్లాలో మొత్తం పోలింగ్ 89.30 %

image

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89.30 % పోలింగ్ నమోదైంది. 21 మండలాలు, 492 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా.. మొత్తం 4,98,152 మంది ఓటర్లకు 4,44,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 2,39,339లో 2,15,602 మంది, మహిళలు 2,58,806లో 2,29,235 మంది, ఇతరులు ఏడుగురిలో 5 మంది ఓటు వేశారు.

News December 18, 2025

చేగుంట: ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

image

పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేగుంట మండలం కరీంనగర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అక్బర్ గత నెల 29న ఈ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో గురువారం మరణించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News December 18, 2025

‘టెన్త్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించాలి’

image

STUTS మెదక్ జిల్లా 2026 నూతన సంవత్సర క్యాలండర్‌ను అదనపు కలెక్టర్ నగేష్ ఆవిష్కరించారు. జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నరేష్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్మా ట్లాడుతూ.. STUTS సంఘ బాధ్యులు పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో సహకరించడం అభినందనీయమన్నారు. టెన్త్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి విజయ అన్నారు.