News December 21, 2025

SRD: ఇంటర్ పూర్తి.. 21 ఏళ్లకే సర్పంచ్‌

image

ఖేడ్ మండలంలోని లింగ నాయక్ పల్లి గ్రామపంచాయతీ 2024లో ఏర్పడింది. గ్రామంలో 279 ఓటర్లు ఉన్నారు. మొదటిసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన 21 ఏళ్ల తంపులూరి శివలక్ష్మి సమీప ప్రత్యర్థి పుల్లయ్య గారి లక్ష్మిపై 84 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శివలక్ష్మి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. కాగా ఖేడ్ మండలంలో అత్యంత తక్కువ ఉన్న వయస్సు సర్పంచ్‌గా శివలక్ష్మి రికార్డ్ సృష్టించింది.

Similar News

News December 24, 2025

2028లోనే ప్రజలు కాంగ్రెస్‌ను బొంద పెడుతారు: KTR

image

TG: పనికిమాలిన <<18660605>>శపథాలు<<>> చేయడం, పత్తాలేకుండా పారిపోవడం రేవంత్‌కు అలవాటని BRS నేత కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘తిట్లు, బూతులతో డైవర్షన్ డ్రామాలు, తమాషాలు ప్రతిసారి పనిచేయవు. 2028లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం. మళ్లీ వందేండ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతిపెట్టడం తథ్యం. మేము ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదు. రైతన్న హక్కులకు భంగం కలిగితే భగ్గున మండుతాం’ అని Xలో ఫైరయ్యారు.

News December 24, 2025

KMR: సైబర్ బాధితులకు రూ.1.07 కోట్లు వాపస్!

image

కామారెడ్డి జిల్లాలో గతేడాది జిల్లాలో 200 సైబర్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 160కి తగ్గింది. ముఖ్యంగా, సైబర్ మోసాలకు గురైన బాధితులకు లోక్ అదాలత్, కోర్టు ఉత్తర్వుల ద్వారా రూ.1,07,31,518 విలువైన సొత్తును తిరిగి ఇప్పించడం విశేషం. 2024లో 35 NDPS కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 23కి తగ్గింది. నిరంతర నిఘా, కఠిన తనిఖీలు చేపట్టడం ద్వారా జిల్లాలో గంజాయి సరఫరాను అడ్డుకోగలిగారు.

News December 24, 2025

కామారెడ్డి జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు..

image

కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన పటిష్టమైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిబంధనల అమలు వల్ల ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 262 మంది మృతి చెందగా, 263 మంది గాయపడ్డారు. 2025లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 200 మంది మృతి చెందగా, 242 మంది గాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే మరణాల సంఖ్యలోనూ, సాధారణ ప్రమాదాల సంఖ్యలోనూ పెద్ద ఎత్తున తగ్గుదల కనిపించడం గమనార్హం.