News March 14, 2025
SRD: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయని చెప్పారు. ఓపెన్ స్కూల్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 13, 2025
NZB: 25 మందికి రూ.18 లక్షల విలువైన చెక్కులు

ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ అన్నారు. గురువారం NZB R&B గెస్ట్ హౌస్లో 25 మంది లబ్ధిదారులకు రూ.18 లక్షల విలువైన CMRF చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు అర్హులకు నిరంతరంగా అందిస్తామన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి CMRF చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు.
News November 13, 2025
పరిస్థితి తీవ్రంగా ఉంది.. మాస్కులు సరిపోవు: SC

ఢిల్లీ గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా ఉందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మాస్కులు సరిపోవని చెప్పింది. లాయర్లు వర్చువల్గా విచారణకు హాజరుకావాలని సూచించింది. ఈ కాలుష్యం వల్ల శాశ్వత నష్టం జరుగుతుందని చెప్పింది. పంట వ్యర్థాలను తగలబెట్టడాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది.
News November 13, 2025
లడ్డూలతో రాజకీయం ఏంటి?: శ్రీవారి భక్తుల ఆగ్రహం

పవిత్రమైన <<18276380>>లడ్డూ ప్రసాదాన్ని<<>> చూపిస్తూ తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ రాజకీయం చేస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. ధర్మారెడ్డి విచారణకు వచ్చిన సమయంలోనూ లడ్డూలు చూపించి పబ్లిసిటీ స్టంట్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలోనే.. తిరుపతి ప్రెస్ క్లబ్లో లడ్డూలు, వడ ప్రసాదాలను బెంచిపై పెట్టి ప్రదర్శించారు. ఇలా లడ్డూలను ముందు పెట్టి రాజకీయం కోసం భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని పలువురు కోరుతున్నారు.


