News November 5, 2025

SRD: ఘోర రోడ్డు ప్రమాదం.. నారాయణఖేడ్ వాసులు మృతి

image

కర్ణాటక రాష్ట్రం హోళికేడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు బుధవారం మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రంలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి క్షేత్రాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 5, 2025

వనపర్తి: జిల్లా వ్యాప్తంగా 1,61,314 రేషన్ సంచులు పంపిణీ

image

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 327 రేషన్ దుకాణాలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 1,61,314 సంచులను సరఫరా చేసింది. ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారునికి కాటన్ సంచులను సరఫరా చేయడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆన్‌లైన్‌లో వేలిముద్ర వేసి బియ్యాన్ని తీసుకున్న వారికి మాత్రమే సంచులను సరఫరా చేయనున్నట్లు అధికారులు, రేషన్ డీలర్లు తెలియజేశారు.

News November 5, 2025

BSNL ఫైబర్.. బేసిక్ ప్లాన్ కేవలం రూ.399!

image

సరసమైన రీఛార్జ్ ప్యాక్స్‌తో యూజర్లను ఇంప్రెస్ చేస్తోన్న ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఇప్పుడు అతి తక్కువ ధరకే ఫైబర్ బేసిక్ ప్లాన్‌ను అందిస్తోంది. BSNL తమ ఫైబర్ బేసిక్ ప్లాన్‌ను కేవలం ₹399గా నిర్ణయించింది. దీంతో 60 Mbps వేగంతో నెలకు 3300 GB డేటాను పొందగలరు. ఆ తర్వాత 4Mbps వేగంతో డేటా లభిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో మొదటి నెల ఉచితం కాగా.. తొలి 3 నెలలు ప్లాన్‌పై అదనంగా ₹100 తగ్గింపు ఉంటుంది.

News November 5, 2025

కోటవురట్ల: రాజీనామా చేసిన వైసీపీ నేతకు బుజ్జగింపులు

image

కోటవురట్ల మండల వైసీపీ అద్యక్ష పదవికి రాజీనామా చేసిన కిలాడ శ్రీనివాసరావుని పలువురు నేతలు బుజ్జగిస్తున్నారు. ఉత్తరాంధ్ర పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఫోన్‌లో మాట్లాడి తొందర పడవద్దని సూచించారు. బుధవారం ఉదయం నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు ఆయన ఇంటికి వెళ్లి చర్చించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. దత్తుడు సీతబాబు పాల్గొన్నారు.