News December 18, 2025
SRD: ‘రాజీతో ఇరు వర్గాలు గెలుపొందినట్లే’

క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశమని జిల్లా ఎస్పీ శ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. రాజీ కుదుర్చుకోవడానికి ఈనెల 21న అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు రాజీపడవచ్చని అన్నారు. అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని, రాజీ కుదుర్చుకోవడం ద్వారా ఇరు వర్గాలు గెలుపొందినట్లు అవుతుందన్నారు.
Similar News
News December 31, 2025
ధర్మపురి: ముక్కోటి ఏకాదశి.. నర్సన్న ఆదాయం ఎంతంటే..?

ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయానికి టికెట్ల ద్వారా రూ.3,25,974లు, ప్రసాదాల విక్రయాలతో రూ.4,51,200లు, అన్నదానం ద్వారా రూ.75,730ల ఆదాయం లభించింది. మొత్తం ఆదాయం రూ.8,52,904లు సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.
News December 31, 2025
నాకేమీ గుర్తు లేదు.. సిట్ విచారణలో ప్రశాంతిరెడ్డి!

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. TDP కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నెల్లూరులోని ఆమె నివాసంలో సిట్ అధికారులు విచారించారు. YCP ప్రభుత్వంలో ఆమె TTD కొనుగోలు కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. కల్తీ గురించి ప్రశ్నించగా.. ‘4నెలలే ఆ పదవిలో ఉన్నా. ఐదేళ్ల కిందట జరిగినవి ఇప్పుడు గుర్తు రావడం లేదు’ అని ఆమె చెప్పినట్లు సమాచారం. చిన్న అప్పన్న తమ దగ్గర PAగా పనిచేయలేదని చెప్పారు.
News December 31, 2025
నాకేమీ గుర్తు లేదు.. సిట్ విచారణలో ప్రశాంతిరెడ్డి!

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. TDP కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నెల్లూరులోని ఆమె నివాసంలో సిట్ అధికారులు విచారించారు. YCP ప్రభుత్వంలో ఆమె TTD కొనుగోలు కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. కల్తీ గురించి ప్రశ్నించగా.. ‘4నెలలే ఆ పదవిలో ఉన్నా. ఐదేళ్ల కిందట జరిగినవి ఇప్పుడు గుర్తు రావడం లేదు’ అని ఆమె చెప్పినట్లు సమాచారం. చిన్న అప్పన్న తమ దగ్గర PAగా పనిచేయలేదని చెప్పారు.


