News December 18, 2025
SRD: ‘రాజీతో ఇరు వర్గాలు గెలుపొందినట్లే’

క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశమని జిల్లా ఎస్పీ శ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. రాజీ కుదుర్చుకోవడానికి ఈనెల 21న అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు రాజీపడవచ్చని అన్నారు. అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని, రాజీ కుదుర్చుకోవడం ద్వారా ఇరు వర్గాలు గెలుపొందినట్లు అవుతుందన్నారు.
Similar News
News December 31, 2025
తూ.గో.లో ‘మత్తు’ రికార్డు.. డిసెంబర్లోనే 100 కోట్లు హాంఫట్!

తూర్పుగోదావరి జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు రూ.100 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్లు అధికార గణాంకాలు తెలిపాయి. కొత్త ఏడాది వేడుకల కోసం ఎక్సైజ్ శాఖ రూ.25 కోట్ల విలువైన 1.60 లక్షల కేసుల మద్యాన్ని సిద్ధం చేసింది. వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
News December 31, 2025
ఎస్పీగా విక్రాంత్ పాటిల్ పదిలమైన ముద్ర

కర్నూలు జిల్లా ఎస్పీగా 10 నెలల కాలంలో తనదైన ముద్ర వేసిన విక్రాంత్ పాటిల్, డీఐజీగా పదోన్నతి పొందారు. ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన ఆయన సైబర్ నేరాలు, గంజాయి విక్రయాలు, ఈవ్టీజింగ్పై ఉక్కుపాదం మోపారు. హెల్మెట్ ధారణ, డ్రంక్ అండ్ డ్రైవ్పై అవగాహన కల్పిస్తూ నేరాల శాతాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. పదోన్నతి పొందిన ఆయన త్వరలోనే కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
News December 31, 2025
నెల్లూరు జిల్లాలో ఇలా చేస్తే నెలకు రూ.25వేలు

నెల్లూరు జిల్లాలో స్వచ్ఛరథం ఆపరేటర్లకు ప్రభుత్వం నెలకు రూ.25వేలు ఇస్తుంది. అతను ఇంటింటికీ తిరిగి KG ఇనుము, స్టీల్ వస్తువులు రూ.20, పేపర్లు రూ.15, గాజు సీసా రూ.2చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తడి, పొడి చెత్త తీసుకుని దానికి తగిన సరకులు ఇవ్వాలి. జనవరి 4లోపు MPDO ఆఫీసులో అప్లికేషన్లు ఇస్తే 9న ఎంపిక చేస్తారు. కావలి, కోవూరు, ముత్తుకూరు, వింజమూరు, ఆత్మకూరు, ఇందుకూరుపేట తదితర మండలాల్లో అవకాశం ఉంది.


