News April 11, 2025

SRD: 08455 276155 నంబర్‌ను వినియోగించుకోండి: కలెక్టర్

image

ప్రభుత్వ పథకాలు అమలు కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 08455 276155 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, తాగునీటి సమస్య కోసం పై నెంబర్‌కి ఫోన్ చేయాలని చెప్పారు. పనివేళలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News September 18, 2025

అసెంబ్లీ సమావేశాలు కుదింపు

image

AP: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల పనిదినాలను ప్రభుత్వం 8 రోజులకు కుదించింది. ఈనెల 27 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత అసెంబ్లీని ఈనెల 30 వరకు నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో <<17749258>>నిర్ణయించిన<<>> విషయం తెలిసిందే. అటు రేపు మధ్యాహ్నం రూ.1.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. సభలో ఆమోదించాల్సిన అంశాలపై చర్చించనుంది.

News September 18, 2025

అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి: కలెక్టర్

image

అందరికీ విద్య, సౌకర్యాలు అందించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, మరమ్మతులు వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుపై పంచాయతీరాజ్, విద్యా, మహిళా సంక్షేమ, డీఆర్డీఓ, గిరిజన, టీజీడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు.

News September 18, 2025

ఆసిఫాబాద్: పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

image

పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నెహ్రూ నగర్‌కు చెందిన మాచర్ల రమేశ్ మొక్కజొన్న పంటను బుధవారం అడవి పందులు ధ్వంసం చేశాయి. కలత చెందిన రైతు అదే రోజు తన పంట చేనులోనే పురుగు మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.