News March 17, 2024

SRD: సిలిండర్‌ పేలి తాత, మనవరాలి మృతి

image

గ్యాస్‌ సిలిండర్‌ పేలి తీవ్రంగా గాయపడిన ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 10న రాత్రి స్థానిక మాణిక్‌ ప్రభు వీధిలో ఎరుకల లక్ష్మన్న ఇంట్లో గ్యాస్‌ లీకై మంటలు అలుముకున్నాయి. ఆయన్ను కాపాడే క్రమంలో కోడలు సుగుణ, మనవరాలు కీర్తి(4) గాయపడ్డారు. వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిచంగా చికిత్స పొందుతూ కీర్తి శుక్రవారం, నిన్న లక్ష్మన్న చనిపోయారు. తాత, మనుమరాలు మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.

Similar News

News February 4, 2026

ఏడుపాయల వనజాతర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: కలెక్టర్

image

ఏడుపాయల వనదుర్గా క్షేత్రంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. బుధవారం ఏడుపాయలలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

News February 4, 2026

మెదక్: అర్ధరాత్రి యాక్సిడెంట్!

image

శివంపేట్ మండలం పరిధిలోని పిల్లుట్ల గేట్ సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో బైక్ తీవ్రంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో బైక్‌పై ఉన్న వ్యక్తి రోడ్డు పక్కనే పడిపోయి గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

News February 4, 2026

పదవ తరగతిలో మెరుగైన ఫలితాలే లక్ష్యం: డీఈవో

image

విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని DEO విజయలక్ష్మి పిలుపునిచ్చారు. పాపన్నపేట మండలం యూసుఫ్‌పేట ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన డీఈవో, చదువుపై పూర్తి దృష్టి సారించాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల మార్గనిర్దేశాన్ని పాటిస్తూ లక్ష్య సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు హితవు పలికారు.