News April 24, 2025

SRD: ‘పాఠశాల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి’

image

విద్యారంగా సమస్యలపైన బుధవారం విద్యా శాఖ కార్యదర్శి యోగితా రానా ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయుల కృషి తప్పనిసరి అని, పాఠశాల బలోపేతానికి ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహ రెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన, అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Similar News

News April 24, 2025

కర్రెగుట్టలో కాల్పుల మోత.. ముగ్గురు మావోయిస్టులు మృతి

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌లో సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. హిడ్మా, దేవా వంటి అగ్ర కమాండర్లు ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని 3వేలకు పైగా బలగాలు చుట్టుముట్టాయి. నేలమీది నుంచి, గగనతలం నుంచి ముమ్మర కూంబింగ్‌తో ఆ ప్రాంతాన్ని దిగ్బంధించాయి. ఈక్రమంలో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లో ముగ్గురు మావోలు మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

News April 24, 2025

అనకాపల్లి: మే 19 నుంచి ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షలు

image

అనకాపల్లి జిల్లాలో ఓపెన్ స్కూల్‌కు సంబంధించి సెకండరీ బోర్డు, 10వ తరగతి పరీక్షలు మే 19 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. మే 28వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ నెల 24 నుంచి 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. అధికారిక వెబ్‌సైట్‌లో హెచ్.ఎం లాగిన్ నుంచి ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

News April 24, 2025

KNR: నేటి నుంచి బాలభవన్ లో వేసవి శిక్షణ

image

కలెక్టర్, విద్యాశాఖ సహకారంతో బాలభవన్ ఆధ్వర్యంలో నేటి నుంచి వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయనిబాలభవన్ సూపరింటెండెంట్ కే.మంజుల దేవి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 10 వరకు ప్రతీ రోజు ఉదయం 7 గం. నుంచి 12 గం. వరకు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. 5 నుంచి 16 సం. వయస్సు ఉన్న వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల వారు తమ ఆధార్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తో అంబేడ్కర్ స్టేడియంలోని శిక్షణ శిబిరంలో నమోదు చేసుకోవాలన్నారు.

error: Content is protected !!