News December 21, 2024
శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది: కిమ్స్

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యంపై కిమ్స్ ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ సాయం లేకుండా శ్వాస తీసుకుంటున్నట్లు వివరించింది. అప్పుడప్పుడూ జ్వరం వస్తోందని పేర్కొంది. నిన్నటితో పోల్చితే ఇవాళ ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు బులిటెన్లో వెల్లడించారు. అటు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు.
Similar News
News December 22, 2025
బిగ్బాస్ విన్నర్ కంటే ఇతడికే ఎక్కువ రెమ్యునరేషన్!

నిన్నటితో ముగిసిన బిగ్బాస్-9లో కళ్యాణ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అతడు రూ.35లక్షలు గెలుచుకున్నారు. అయితే 4వ స్థానంలో ఎలిమినేట్ అయిన ఇమ్మాన్యుయేల్.. కళ్యాణ్ కంటే ఎక్కువ మనీ అందుకున్నట్లు తెలుస్తోంది. 15వారాలకు గానూ వారానికి రూ.2.50 లక్షల చొప్పున అతడు మొత్తం రూ.35-40లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న వారిలో ముందువరుసలో ఇమ్మాన్యుయేల్ ఉన్నారు.
News December 22, 2025
టిప్పే రూ.68,600 ఇచ్చేశాడు!

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ, అభిరుచి ఉంటుంది. కొందరిలో అది కాస్త ఎక్కువ ఉంటుంది. బెంగళూరులో ఓ వ్యక్తి డెలివరీ బాయ్స్కు ఏడాదిలో ₹68,600, చెన్నై యూజర్ ₹59,505 టిప్స్ ఇచ్చినట్లు స్విగ్గీ ఇన్స్టామార్ట్ వెల్లడించింది. ‘ముంబైకర్ ఏడాదిలో రెడ్ బుల్ షుగర్ ఫ్రీ కోసం ₹16.3L, నోయిడా వ్యక్తి బ్లూటూత్ స్పీకర్లు, SSDల కోసం ₹2.69L వెచ్చించారు. ఓ హైదరాబాదీ 3 ఐఫోన్స్ కోసం ₹4.3L ఖర్చు చేశారు’ అని తెలిపింది.
News December 22, 2025
పాస్టర్లకు గౌరవ వేతనం మేమే ప్రారంభించాం: చంద్రబాబు

AP: కూటమి ప్రభుత్వం ప్రతి మతాన్ని గౌరవిస్తూ అందరి కోసం పనిచేస్తుందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాస్టర్లకు గౌరవ వేతనం తామే ప్రారంభించామని చెప్పారు. ఈ నెల 24న రూ.50కోట్లు విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వాలు పెట్టలేని రోజుల్లోనే క్రైస్తవ సంస్థలు విద్యాసంస్థలు ఏర్పాటు చేశాయని, NTR కూడా మిషనరీ స్కూల్లోనే చదువుకున్నారని CM గుర్తుచేశారు.


