News September 29, 2024
చరిత్ర సృష్టించిన శ్రీలంక
న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 15 ఏళ్ల తర్వాత ఆ జట్టు కివీస్పై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. తొలి ఇన్నింగ్స్లో 88కే ఆలౌటైన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 360కే పరిమితమైంది. కాన్వే(61), బ్లండెల్(60), ఫిలిప్స్(78), శాంట్నర్(67) అర్ధ సెంచరీలతో రాణించారు. నిశాన్ పెరీస్ 6 వికెట్లతో చెలరేగి లంకకు విజయాన్ని కట్టబెట్టారు.
Similar News
News September 29, 2024
RCB ఆ ఒకర్ని తప్ప అందర్నీ వదిలేయాలి: ఆర్పీ సింగ్
ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ ఫ్రెష్గా రంగంలోకి దిగాలని మాజీ క్రికెటర్ RP సింగ్ అభిప్రాయపడ్డారు. విరాట్ను తప్ప అందర్నీ వదిలేయాలన్నారు. ‘కోహ్లీ జట్టుతోనే ఉండాలి. అతడి చుట్టూ టీమ్ నిర్మించాలి. మిగిలిన కీలక ఆటగాళ్లను RTMతో సొంతం చేసుకుంటే చాలు. సిరాజ్, పాటీదార్ వంటి కీలక ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేయొచ్చు. ఆ జట్టులో ఇప్పుడున్న వారిలో విరాట్ తప్ప వేరెవ్వరూ రూ. 14-18 కోట్లు పలికే ఛాన్స్ లేదు’ అని తెలిపారు.
News September 29, 2024
రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా పథకాల అమలు: మంత్రి నారాయణ
AP: ప్రపంచంలోని 5 ఉత్తమ రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిలపాలన్నదే CM చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. 2014-19 మధ్య తమ ప్రభుత్వం 9 లక్షల గృహాలు మంజూరు చేయడం దేశంలోనే రికార్డన్నారు. టిడ్కో ఇళ్లను నిర్మించిన కాంట్రాక్టర్లకు YCP ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ CBN చాకచక్యంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
News September 29, 2024
హెజ్బొల్లాకు మరో భారీ ఎదురుదెబ్బ?
హెజ్బొల్లాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. హెజ్బొల్లా టాప్ కమాండర్ నబీల్ క్వాక్ను ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ హతమార్చినట్లు సమాచారం. కాగా నబీల్ 1995 నుంచి 2010 వరకు హెజ్బొల్లా మిలిటరీ కమాండర్గా పని చేశారు. 2020లో అతడిని US ఉగ్రవాదిగా గుర్తించింది. కాగా నిన్న బీరుట్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాతోపాటు ఆయన కుమార్తె కూడా మరణించిన సంగతి తెలిసిందే.