News April 6, 2025
శ్రీరామనవమి.. కొన్ని ప్రశ్నలు

రామాయణం గురించి మీకు కొన్ని ప్రశ్నలు. జవాబులు కామెంట్ చేయండి.
1.రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
2.లక్ష్మణుని భార్య ఊర్మిళ తండ్రి ఎవరు?
3.రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో కవలలు ఎవరు?
4.గంగను భూమికి తీసుకొచ్చేందుకు ఎవరు తపస్సు చేశారు?
5.శివధనుస్సును ఎవరు తయారుచేశారు?
6.సీతను అపహరించేందుకు రావణుడు ఎవరి సాయం కోరాడు?
7.రావణుడిని వధించేందుకు రాముడికి ఎవరు రథం పంపారు?
Similar News
News April 7, 2025
జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడు.. వైసీపీ ట్వీట్లు

AP: తమ పార్టీ అధినేత జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడు అంటూ వైసీపీ వరుస ట్వీట్లు చేస్తోంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాజశ్యామల యాగం నిర్వహించారని పేర్కొంది. అమరావతి, విశాఖ, భువనేశ్వర్, కశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేసింది. విజయవాడలో చంద్రబాబు కూల్చేసిన ఆలయాలకు తిరిగి శంకుస్థాపన చేశారని తెలిపింది.
News April 7, 2025
హిట్మ్యాన్ Vs ఛేజ్మాస్టర్.. గెలుపెవరిది?

IPL: వాంఖడేలో ఇవాళ MI, RCB మధ్య హై ఆక్టేన్ మ్యాచ్ జరగనుంది. గాయంతో గత మ్యాచ్కు దూరమైన రోహిత్ ఇవాళ అందుబాటులో ఉంటారని తెలిసింది. దీంతో హిట్మ్యాన్ రోహిత్, ఛేజ్ మాస్టర్ కోహ్లీ మధ్య పోరు వీక్షించేందుకు ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. బుమ్రా కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అతడి బౌలింగ్లో 5సార్లు ఔటైన విరాట్ 95 బంతుల్లో 140రన్స్ చేశారు. హెడ్ టు హెడ్ MI-19, RCB-14. ఇవాళ పైచేయి ఎవరిదో? COMMENT చేయండి.
News April 7, 2025
BLACK MONDAY: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్స్

భారత స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 3939 పాయింట్లు నష్టపోయి 71,425, నిఫ్టీ 1,160 పాయింట్లు కోల్పోయి 21,743 వద్ద ప్రారంభమయ్యాయి. బ్యాంకు, ఫార్మా, ఐటీ రంగాల షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు రూ.19 లక్షల కోట్లు నష్టపోయారు. దీంతో నిపుణులు ఇవాళ బ్లాక్ మండేగా పేర్కొంటున్నారు.