News December 25, 2024
ఆ సమయంలో శ్రీదేవీ నాతో మాట్లాడలేదు: బోనీ కపూర్

పెళ్లి ప్రతిపాదన తీసుకురావడంతో శ్రీదేవి తనతో ఆరు నెలల పాటు మాట్లాడలేదని నిర్మాత బోనీ కపూర్ చెప్పారు. ఇద్దరు పిల్లల తండ్రిగా ఉండి, అలా ఎలా మాట్లాడుతున్నారని ఆ సమయంలో ప్రశ్నించినట్లు గుర్తు చేశారు. ముందుగా తానే శ్రీదేవికి ప్రపోజ్ చేసినట్లు వెల్లడించారు. తన చివరి రోజు వరకు ఆమెను ప్రేమిస్తూ ఉంటానని పేర్కొన్నారు. 2018లో శ్రీదేవి దుబాయ్లో మరణించిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి జాన్వీ, ఖుషీ కపూర్ సంతానం.
Similar News
News November 28, 2025
సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


