News October 26, 2024
ఆయన కోసం వారం రోజులు ఉపవాసం చేసిన శ్రీదేవి!

సినీతారలకు సంబంధించిన కొన్ని సంగతులు ఆసక్తిగా ఉంటాయి. సూపర్స్టార్ రజినీకాంత్తో దివంగత నటి శ్రీదేవికి మంచి స్నేహం ఉంది. 2011లో రజినీ తీవ్ర అనారోగ్యానికి గురై సింగపూర్లోని ఓ ఆస్పత్రిలో చేరారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. రజినీ కోలుకోవాలని మొక్కుకున్న శ్రీదేవి వారం పాటు ఉపవాసం చేశారు. ఆయన కోలుకున్నాక పుణేలోని బాబా ఆలయాన్ని దర్శించుకున్నారు. వారిద్దరూ కలిసి 18 సినిమాల్లో నటించడం విశేషం.
Similar News
News November 20, 2025
IBPS క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

అక్టోబర్ 4,5,11 తేదీల్లో నిర్వహించిన ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు <
News November 20, 2025
స్కాలర్షిప్ బకాయిల విడుదలకు ఆదేశం

TG: ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2,813 కాలేజీలకు సంబంధించి రూ.161 కోట్ల బకాయిలు ఉన్నట్టుగా అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటిని వెంటనే విడుదల చేయాలని భట్టి ఆదేశించారు.
News November 20, 2025
అందుకే రూపాయి పతనమైంది: RBI గవర్నర్

డాలర్కు డిమాండ్ పెరగడం వలనే రూపాయి పతనమైందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. రూపాయి విలువను నిర్దిష్టంగా లెక్కించడం లేదని స్పష్టం చేశారు. అమెరికన్ కరెన్సీకి విలువ పెరగడం వల్లే రూపాయి విలువ తగ్గిందన్నారు. మార్కెట్ ఎలా జరుగుతోంది అనే దానిపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని చెప్పారు. డాలర్కు డిమాండ్ పెరిగితే రూపాయి విలువ తగ్గినట్టే, రూపాయి డిమాండ్ పెరిగితే డాలర్ పతనమవుతుందని తెలిపారు.


