News March 18, 2024
శ్రీకాకుళం: కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం రద్దు

నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు డీఆర్ఓ ఎం.గణపతి రావు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న వినతుల స్వీకరణ కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తరువాత తదుపరి తేదీ ప్రకటిస్తామని తెలిపారు.
Similar News
News January 27, 2026
శ్రీకాకుళం: యాక్సిడెంట్.. రైస్ మిల్లర్ మృతి

నరసన్నపేటకు చెందిన రైస్ మిల్లర్ వెంకటరమణ (67) విశాఖపట్నం మద్దిలపాలెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు. మంగళవారం ఉదయం తన కుమార్తె ఇంటి వద్ద నుంచి మార్కెట్కు స్కూటీపై వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News January 27, 2026
పోలమాంబ సిరిమాను సంబరం నేడే..!

మక్కువ(M) శంబర శ్రీ పోలమాంబ తల్లి సిరిమానోత్సవానికి అధికారులు అన్నీ సిద్ధం చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు సిరిమానోత్సవం ప్రారంభం కానుందని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. తొలుత పూజారిని చదురు గుడి నుంచి భుజాలపై మోసుకొని మంగళవాయిద్యాల నడుమ వెళ్లి సిరిమాను అధిరోహిస్తారు. భక్తులు అరటి పండ్లు, చీరలు, కొబ్బరి కాయలతో మొక్కులు చెల్లిస్తారు.
News January 27, 2026
ఇత్తడితో శ్రీముఖలింగం ఆలయ నమూన

సారవకొట మండలం బుడితి గ్రామంలో కంచు, ఇత్తడి పరిశ్రమ ఉన్న విషయం తెలిసిందే. ఇందులో పనిచేస్తున్న కార్మికుడు జనార్ధన రావు సూమారు అరకేజి ఇత్తడితో శ్రీముఖలింగం ఆలయ నమూనను తయారు చేశారు. ఇటీవల వీరికి లేపాక్షి వారు అందించిన శిక్షణతో దీన్ని రూపొందించారు. వచ్చే నెల మహా శివరాత్రి పురస్కరించుకొని ఈ కళాఖాండాన్ని తయారు చేసినట్లు ఆయన సోమవారం తెలిపారు. మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే పలువురికి ఉపాధి లభిస్తుంది.


